అన్వేషించండి

Ramoji Rao : ప్రజాజీవితంలోకి లేని పవర్ ఫుల్ లీడర్ రామోజీరావు - తలవంచని మీడియా ప్రతిపక్ష సారధి !

Ramoji Rao death : రామోజీరావు రాజకీయాల్లో లేరు కానీ రాజకీయంగా పవర్ ఫుల్. మీడియా ద్వారా ప్రభుత్వాలపై ప్రజాసమస్యలపై ఆయన పోరాడిన తీరు ఆయనను పవర్ ఫుల్ గా నిలబెట్టింది.

Ramoji Rao is not in politics but politically powerful :  రామోజీరావు ఎవరు ? . ఓ ఎంపీగా ఎప్పుడూ చేయలేదు.. .ఓ ఎమ్మెల్యే అసలే కాదు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలు చేయలేదు. కానీ ఆయన ముద్ర మాత్రం రాజకీయాల్లో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇది నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి జగన్ వరకూ సాగింది. తాను నమ్మిన సిద్ధాంతానికి మాత్రమే రామోజీరావు బద్దుడు. ప్రజా వ్యతిరేకంగా ఏమున్నా ఆయన నిస్సంకోచంగా వ్యతిరేకిస్తాడు. 

మీడియాను ప్రజాస్వామ్య ప్రతిపక్షంగా మలిచిన ధీరుడు

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా.  మీడియా అంటే పాలకపక్షానికి ఎప్పుడూ ప్రతిపక్షమే. ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజాసమస్యలను ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు కఠినమైన మార్గాన్నే ఎంచుకున్నారు. సమస్య తీవ్రతను బట్టి ప్రభుత్వాలపై అంతే కఠినంగా ప్రశ్నించేవారు. మీడియాను నిఖార్సైన ప్రతిపక్షంగా నిలపడంలో ఆయన దేనికీ  భయపడలేదు. ఏమీ ఆశించలేదు. ఆ తత్వమే ఆయనను ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతిపక్ష ధీరునిగా నిలబెట్టింది. 

ఎలాంటి వేధింపులనైనా ఎదుర్కొన్న ధైర్యశాలి

ఇందిరాగాంధీ హయాంలో ఎదురైన వేధింపుల దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎదురైనా ఇబ్బందులను కూడా ఆయన గట్టిగా ఎదుర్కొన్నారు కానీ.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఓ సందర్భంలో శాసనమండలిలో జరిగిన రభసపై ఈనాడు పత్రికలో పెట్టిన హెడ్ లైన్ ను కారణం చూపి ఆయనను అరెస్టు చేయాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఆస్తులపై దాడి చేశారు. మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి విషయంలో వ్యవహారంచిన తీరు ఎలా ఉందో ప్రజలందరూ చూశారు. కానీ ఎక్కడా తగ్గలేదు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. 

రామోజీరావు ప్రముఖుల్ని కలవడం తక్కువ - వారే కలుస్తారు !

రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా సెలబ్రిటీగా నిలిచారు. అయితే ఆయన ఫలానా పని ఆశించడం కానీ.. చేయించుకోవడం కానీ తన జీవితంలో చేసి ఉండరు. హైదరాబాద్ వస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెళ్తారు. నిజానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి రామోజీరావుతో మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈటీవీ గుజరాత్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఆపరేట్ చేసేవారు. అప్పట్లో మోదీ హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలిసేవారు. ప్రధాని అయిన తర్వాత కూడా కలిశారు. 

వ్యక్తిత్వమే రామోజీరావు పవర్ 
 
రామోజీరావు ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు. ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎప్పుడూ తాను పెట్టుకున్న విలువల్ని,  పెట్టుకున్న గీతల్ని దాటాలని అనుకోలేదు. దాటితే ఎంత లాభం వస్తుందని ఆలోచన కూడా మనసులోకి రానివ్వలేదు. విలువల మీద నడిచే వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు. అందుకే కరుడుగట్టిన నియంతలు దాడి చేసినా వాటి పునాదుల్ని బలహీనం చేయలేకపోయారు.   నమ్మిన సిద్ధాంతానికి ఆయన కట్టుబడ్డారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget