అన్వేషించండి

TDP Mahanadu: అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు, భారీగా తరలివచ్చిన శ్రేణులు

TDP Mahanadu: రాజమహేంద్రవరం వేమగిరి వద్ద టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

TDP Mahanadu: రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ. రామారావు శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈ సారి మహానాడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది టీడీపీ నాయకత్వం. రెండ్రోజుల పాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరే భారీ ఏర్పాట్లు చేశారు. 

చిత్తూరు ప్రతినిధిగా చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకుని చిత్తూరు జిల్లా కౌంటర్ లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహానాడును చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా బాబు ప్రారంభించారు. ఇక మహానాడు ప్రాంగణం అంతా కార్యకర్తలు, అభిమానుల రాకతో కళకళలాడుతోంది. ఇంకోవైపు పార్టీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో నగరం అంతా పసుపు మయంగా మారింది.

గుంటూరు ప్రతినిధిగా లోకేష్

మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంతం అంతా సందడిగా మారింది. మహానాడు ప్రాంగణానికి వస్తూ పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ.. అందర్నీ పలకరించుకుంటూ లోకేష్ స్టేజీపైకి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర ఘంటా శ్రీనివాస్.. లోకేష్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు లోకేష్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. పాదయాత్రతో మంచి జోష్ వచ్చిందని టీడీపీ శ్రేణులు లోకేష్ కు తెలియజేశారు. గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్ట్రర్ లో లోకేష్ తన పేరు నమోదు చేసుకున్నారు. 

అచ్చెన్న ప్రశ్నల వర్షం 

ఏడాది కాలంలో చనిపోయిన టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు. అనంతరం మాట్లాడిన పార్టీ ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్న... జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేశారు. సీఎం జగన్ పచ్చి మోసగాడని ధ్వజమెత్తారు. అబద్దాల కోరు అని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం పేద అరుపులు అరుస్తున్నాడని విమర్శించారు. జగన్ అఫిడవిట్‌లో ఏముందో చెప్పగలవా అని సవాల్ చేశారు. దోపిడీదారుడైన జగన్ వద్ద 510 కోట్లు ఉన్నాయని తెలిపారు అచ్చెన్న. 

2004లో ఇల్లు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఊరుకో బంగ్లా ఉన్న జగన్ పేదవాడా అని నిలదీశారు. పులివెందుల, ఇడుపులపాయ, లోటస్‌ పాండ్, అమరావతి, చెన్నై, బెంగళూరులో ఉన్న వాటి గురించి చెప్పాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget