అన్వేషించండి

బాబాయి వివేకా హత్య కేసులో సీఎం తమ్ముడి అరెస్ట్ ఖాయం!: ఏపీ మాజీ మంత్రులు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కడప డ్రామాను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలన్నీ అన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. కడప డ్రామాను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలన్నీ అని అన్నారు. నాలుగు దశాబ్ధాలుగా కొనసాగుతోన్న చిట్ ఫండ్ కంపెనీ అని, మార్గదర్శి చిట్ లో ఉన్న ఎవ్వరూ కూడా తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయలేదన్నారు. అయినప్పటికీ ఈ అరెస్ట్ లు కక్షపూరిత రాజకీయాలు కోసమే అన్నారు. రాజమండ్రి టౌన్ లో ఆదిరెడ్డి భవానీ 25 వేల మెజార్టీతో గెలిస్తే కక్ష కడతావా.. కక్షపూరిత వైఖరితో పైశాచిక ఆనందంతో భయపెట్టాలని చూస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. తామెవరం ఈ అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు.
నీలాగా సూట్ కేస్ కంపెనీలు పెట్టలేదంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు దేవినేని ఉమ. తాడేపల్లిలో ఎవరి పేరు బయటకు వస్తుందోనని జగన్ భయపడుతున్నారు. నిన్ననే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాడని, భయపడేది లేదన్నారు. జైలుకు వెళ్లేందుకైనా, చావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీలాంటి రాక్షసులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదిలక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లి, రెండు లక్షల కోట్లు దోచుకుని, 41 వేల కోట్లు ఒక్క లిక్కర్ లోనే దోచుకున్నావని ఆరోపించారు. పేదవాళ్ల గుండెలు ఆగిపోతున్నాయని, ఊపిరితిత్తులు, కిడ్నీలు చెడి పోతున్నాయన్నారు. 
 
సీఎం జగన్ తమ్ముడి అరెస్ట్ ఖాయం.. 
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని దేవినేని ఉమ అన్నారు. మే 10న, లేక 13వ తేదీన అరెస్ట్ అవుతాడో చూద్దామన్నారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పెద్దిరెడ్డి కర్నాటకలో కూర్చుని సీఎం దోచుకున్న సొమ్మంతా అక్కడ పెడుతున్నారని ఆరోపించారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని, తప్పుడు కేసులు అన్నీటిపై న్యాయస్ధానంలో పోరాటం చేస్తున్నారని, న్యాయం గెలుస్తుందన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు త్వరలోనే బయటకు వస్తారన్నరు. బీసీ వర్గాలమీద, బలహీన వర్గాల నాయకులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహానాడులో లక్షలాది మంది రాజమండ్రిలో కదం తొక్కబోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే నీ వక్ర బుద్ది బయటపెట్టావంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. రాజమండ్రిలో మహానాడు జయప్రదం అవుతుందన్నారు.
 
అవినీతిపరుడు, జైలు పక్షి..
ముఖ్యమంత్రి జగన్ క్రిమినల్ మైండ్ తో సీఐడీతో కేవలం టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం, వేధించడం వంటివి చేస్తున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేసి పోవాలన్నారు. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎంతో మందితో పోరాడామని, మేమేదో భయపడిపోతామని అనుకుంటున్నాడని, పిరికిపంద, చేతకాని నేత జగన్ అంటూ పరుష పదజాలాన్ని వాడారు. బీసీలను వేధిస్తూ ఎందుకు టార్గెట్ చేస్తున్నావని సీఎంను ప్రశ్నించారు. జగన్ అవినీతి పరుడని, జైలు పక్షి అని విమర్శించారు. మర్డర్లు, హత్యలు చేసి రాజకీయాలు చేయలేదన్నారు. కానీ కంప్లైంట్ లేకున్నా తమను, కొన్ని సంస్థలను ఏపీ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. అటు మార్గదర్శిని, ఇటు ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు చెందిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీని తామెప్పుడూ వేధించలేదన్నారు.
 
మహానాడు గురించి ఓర్వలేకనే..
రాజమండ్రిలో మహానాడు విజయవంతం అయితే జగన్ చరిత్ర ముగుస్తుందని భావించి కుట్రలు పన్నారని ఆరోపించారు. 1993లో ఎన్టీఆర్ ఇక్కడే మహానాడు పెట్టి కాంగ్రెస్ ను మట్టికరిపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే చిట్ ఫండ్ కంపెనీని మూయించివేస్తానని బెదిరించారన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ ఓ పిట్టల దొర అని, అతనికి ఏమీ తెలియదన్నారు. బీసీ కులాన్ని కించపరుస్తున్నావని మండిపడ్డారు. టీడీపీ బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. సీఐడీ వేధింపులు ఆపకుంటే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget