అన్వేషించండి

బాబాయి వివేకా హత్య కేసులో సీఎం తమ్ముడి అరెస్ట్ ఖాయం!: ఏపీ మాజీ మంత్రులు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. కడప డ్రామాను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలన్నీ అన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. కడప డ్రామాను డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలన్నీ అని అన్నారు. నాలుగు దశాబ్ధాలుగా కొనసాగుతోన్న చిట్ ఫండ్ కంపెనీ అని, మార్గదర్శి చిట్ లో ఉన్న ఎవ్వరూ కూడా తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయలేదన్నారు. అయినప్పటికీ ఈ అరెస్ట్ లు కక్షపూరిత రాజకీయాలు కోసమే అన్నారు. రాజమండ్రి టౌన్ లో ఆదిరెడ్డి భవానీ 25 వేల మెజార్టీతో గెలిస్తే కక్ష కడతావా.. కక్షపూరిత వైఖరితో పైశాచిక ఆనందంతో భయపెట్టాలని చూస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. తామెవరం ఈ అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు.
నీలాగా సూట్ కేస్ కంపెనీలు పెట్టలేదంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు దేవినేని ఉమ. తాడేపల్లిలో ఎవరి పేరు బయటకు వస్తుందోనని జగన్ భయపడుతున్నారు. నిన్ననే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాడని, భయపడేది లేదన్నారు. జైలుకు వెళ్లేందుకైనా, చావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీలాంటి రాక్షసులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పదిలక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లి, రెండు లక్షల కోట్లు దోచుకుని, 41 వేల కోట్లు ఒక్క లిక్కర్ లోనే దోచుకున్నావని ఆరోపించారు. పేదవాళ్ల గుండెలు ఆగిపోతున్నాయని, ఊపిరితిత్తులు, కిడ్నీలు చెడి పోతున్నాయన్నారు. 
 
సీఎం జగన్ తమ్ముడి అరెస్ట్ ఖాయం.. 
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని దేవినేని ఉమ అన్నారు. మే 10న, లేక 13వ తేదీన అరెస్ట్ అవుతాడో చూద్దామన్నారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పెద్దిరెడ్డి కర్నాటకలో కూర్చుని సీఎం దోచుకున్న సొమ్మంతా అక్కడ పెడుతున్నారని ఆరోపించారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని, తప్పుడు కేసులు అన్నీటిపై న్యాయస్ధానంలో పోరాటం చేస్తున్నారని, న్యాయం గెలుస్తుందన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు త్వరలోనే బయటకు వస్తారన్నరు. బీసీ వర్గాలమీద, బలహీన వర్గాల నాయకులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహానాడులో లక్షలాది మంది రాజమండ్రిలో కదం తొక్కబోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే నీ వక్ర బుద్ది బయటపెట్టావంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. రాజమండ్రిలో మహానాడు జయప్రదం అవుతుందన్నారు.
 
అవినీతిపరుడు, జైలు పక్షి..
ముఖ్యమంత్రి జగన్ క్రిమినల్ మైండ్ తో సీఐడీతో కేవలం టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం, వేధించడం వంటివి చేస్తున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేసి పోవాలన్నారు. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎంతో మందితో పోరాడామని, మేమేదో భయపడిపోతామని అనుకుంటున్నాడని, పిరికిపంద, చేతకాని నేత జగన్ అంటూ పరుష పదజాలాన్ని వాడారు. బీసీలను వేధిస్తూ ఎందుకు టార్గెట్ చేస్తున్నావని సీఎంను ప్రశ్నించారు. జగన్ అవినీతి పరుడని, జైలు పక్షి అని విమర్శించారు. మర్డర్లు, హత్యలు చేసి రాజకీయాలు చేయలేదన్నారు. కానీ కంప్లైంట్ లేకున్నా తమను, కొన్ని సంస్థలను ఏపీ ప్రభుత్వం వేధిస్తుందన్నారు. అటు మార్గదర్శిని, ఇటు ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు చెందిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీని తామెప్పుడూ వేధించలేదన్నారు.
 
మహానాడు గురించి ఓర్వలేకనే..
రాజమండ్రిలో మహానాడు విజయవంతం అయితే జగన్ చరిత్ర ముగుస్తుందని భావించి కుట్రలు పన్నారని ఆరోపించారు. 1993లో ఎన్టీఆర్ ఇక్కడే మహానాడు పెట్టి కాంగ్రెస్ ను మట్టికరిపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే చిట్ ఫండ్ కంపెనీని మూయించివేస్తానని బెదిరించారన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ ఓ పిట్టల దొర అని, అతనికి ఏమీ తెలియదన్నారు. బీసీ కులాన్ని కించపరుస్తున్నావని మండిపడ్డారు. టీడీపీ బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. సీఐడీ వేధింపులు ఆపకుంటే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.
 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget