అన్వేషించండి

వారాహి యాత్రకు లైన్ క్లియర్-- ఈ రాత్రికే అన్నవరం చేరుకోనున్న పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఈరోజే అన్న‌వ‌రం రానున్నారు. ర‌త్న‌గిరి కొండ‌పై రాజ‌కీయ జెండాలు, ప్ర‌సంగాలు నిషేద‌మ‌ని ఆల‌య ఈవో ప్ర‌క‌టించారు.

కాకినాడ జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బుధవారం నంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేపట్టే వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో టూర్‌ షెడ్యూల్‌ను జనసేన రిలీజ్ చేసింది. 

వారాహి యాత్రకు లైన్ క్లియర్-- ఈ రాత్రికే అన్నవరం చేరుకోనున్న పవన్

జనసేన కార్యాలయంలో యాగం చేస్తున్న పవన్ కల్యాణ్‌ పూర్ణాహుతితో యాగం పూర్తి చేయనున్నారు. అనంతరం అన్నవరం బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ కంటే ముందుగానే వారాహి వాహనం అన్నవరం చేరుకోనుంది. అనుమతి విషయంలో రెండు రోజులుగా చాలా చర్చ నడిచింది. ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సంయమనంతో న్యాయపోరాటం చేస్తామని జనసేన ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి  జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటు అనుమతి విషయంలో ఫాలో అప్ చేశారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతూ వచ్చారు. చివరకు అనుమతి రావడంతో అంతా యాత్ర విజయం చేసే అంశంపై దృష్టి పెట్టారు. 

ఒక రోజు ముందుగానే అన్నవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అన్నవరం కొండపైనే రాత్రి  బస చేస్తారు. బుధవారం ఉదయం రత్నగిరి సత్యదేవుని దర్శనం చేసుకున్నాక అనంతరం వారాహి వాహనానికి పూజలు చేయించి అక్కడి  నుంచి యాత్రకు బయల్దేరనున్నారు. అయితే అన్నవరం పుణ్యక్షేత్రం వద్ద ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు, జెండాలు పట్టుకురావడం, ప్రసంగాలు చేయడం నిషిద్ధమని అటువంటివి జరక్కుండా చూసుకోవాలని జనసేన ముఖ్యనాయకత్వానికి అన్నవరం దేవస్థానం ఈవో ఆజాద్‌ ఇప్పటికే ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

అప్రమత్తమైన ఆలయ అధికారులు..
 
జనసేన అధినేత పవన్‌ సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసి యాత్రను ప్రారంభించనున్న వేళ ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. జనసేనాని కోసం పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు రత్నగిరిపైకి తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండడం, సెలవులతో  భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కొండపైకి ఎటువంటి జెండాలుతో రాకుండా, పరిమితికి మించిపైకి రాకుండా కొండ క్రిందనే దేవస్థానం ముఖ ద్వారం వద్దనే అడ్డుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
 
పల్లవి గెస్ట్‌ హౌల్‌లో పవన్‌ కళ్యాణ్‌..
 
ఈ సాయంత్రానికే అన్నవరం దేవస్థానానికి చేరుకోనున్న జనసేన అధినేత పవన్‌  బస కోసం పల్లవి గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాట్లు చేశారు. ఉదయమే సత్యదేవుని దర్శించుకున్న అనంతరం వారాహి వాహనానికి సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అన్నవరం నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి వరకు రోడ్‌షో, అనంతరం కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారు.

వారాహి యాత్ర బహిరంగ సభల షెడ్యూల్

14 జూన్ 2023 – కత్తిపూడి సభ 

16 జూన్ 2023 – పిఠాపురం వారాహి యాత్ర సభ 

18 జూన్ 2023 – కాకినాడల వారాహి యాత్ర సభ 

20 జూన్ 2023 – ముమ్మిడివరంవారాహి యాత్ర సభ 

21 జూన్ 2023 – అమలాపురం వారాహి యాత్ర సభ 

22 జూన్ 2023 - పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర మలికిపురంలో సభ 

23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర సభ

 
కోనసీమ జిల్లాలో తొలగని అడ్డంకులు..? 
 
కాకినాడ జిల్లాతోపాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కూడా జనసేన అధినేత వపన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో రెండు జిల్లా ఎస్పీలకు అనుమతులు కోరుతూ ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ముఖ్యనాయకులు ఇరు జిల్లా ఎస్పీలను కలిసి అనుమతులు కోరుతూ పత్రాలను, రూట్ మ్యాప్ లు సమర్పించారు. అయితే ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్రకు సంబంధించి అనుమతులు గురించి ఇంకా స్పష్టత లభించలేదు. పవన్‌ ప్రోగ్రాం మినిట్‌ టూ మినిట్‌ వివరాలు ఇవ్వలేదని అందుకే అనుమతులు ఇంకా లభించలేదని పోలీసు వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పోలీసులు వారాహి యాత్రకు మోకాలడ్డితే కోర్టును ఆశ్రయించాలని జనసేన పార్టీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget