అన్వేషించండి

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో భువనేశ్వరి, బ్రాహ్మణితో కలసి నారాయణ చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు.

వ్యవసాయరంగానికి ఎంతో సేవ చేసిన ఎం.ఎస్ స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి, దేశానికి చేసిన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారని పేర్కొన్నారు. స్వామినాథన్ కుటుంబానికి తన సంతాపం తెలియజేయాలని చంద్రబాబు కోరినట్లు అన్నారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో భువనేశ్వరి, బ్రాహ్మణితో కలసి నారాయణ చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. 

‘‘అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్న చంద్రబాబు ఆలోచన  రాష్ట్రం, ప్రజలే. చంద్రబాబు అక్రమ కేసుతో జైల్లో ఉండడం బాధాకరమైనా.. జైలులో చంద్రబాబు మనోధైర్యంగా ఉన్నారు. తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు, మద్ధతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పాలని, అధికార పార్టీ చేసే అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించాలని చంద్రబాబు చెప్పారు’’ అని నారాయణ అన్నారు.

ఇంకా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనకు రాష్ట్రంలో వస్తున్న ప్రజా స్పందన చూసే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నారాయణ అన్నారు. రింగ్ రోడ్డు అంశంలో లోకేష్ పైనా కేసు పెట్టారు. దీనిపై 41ఏ నోటీసులు ఇస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఇది మా మొదటి విజయం. రాష్ట్రంలో వైసీపీ ఏం చేస్తోందో ప్రజలందరికీ తెలుసు.  టీడీపీకి ప్రజల నుంచి వచ్చే మద్ధతును వైఎస్ఆర్ సీపీ ఓర్చుకోలేక పోతుందని.. అందుకే కేసులు, అరెస్ట్ లు చేస్తుందని నారాయణ అన్నారు. 

‘‘అయినా పార్టీకి రెండింతల బలం పెరుగుతోంది. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. రైతులు, ఉద్యోగులు, కూలీలు, యువత అందరూ ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు అరెస్టు చేయడం రాజకీయ కక్షే.. దీనికి వైసీపీ కి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు. ఈడ్పుగల్లులో 40 సెంట్ల భూమిని నేను 2001లో కొన్నాను. ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ ప్లానింగ్ లో ఆ భూమి పోయింది. ఆ భూమి పోయిందని సీఆర్డీఏ అధికారులే మాకు సమాచారం ఇచ్చారు. రూ.7 కోట్ల విలువ చేసే నా భూమి పోతే నేనెలా ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి పాల్పడతాను?

ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజం అయిపోవు. మా బంధువులు కొన్న భూములు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు 7 కి.మీ దూరంలో ఉన్నాయి. వైసీపీకి సాక్షి పత్రిక ఉందని బురదజల్లడమే తెలుసు. మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. టీడీపీ-జనసేన పొత్తుపైనా త్వరలో కమిటీ నియామకం అవుతుంది. కమిటీ నిర్ణయాల ప్రకారం ప్రకారం ముందుకు వెళ్తాం. చంద్రబాబు జైల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు.. అయినా తప్పలేదు’’ అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget