అన్వేషించండి

Sharmila About Jagan: ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడు, బీజేపీకి తొత్తు - రాజమండ్రిలో వైఎస్ షర్మిల ఫైర్

Andhra Pradesh News: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించారు.

రాజమండ్రి: తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి దత్తపుత్రుడు అని వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి లో రోడ్ షో & భారీ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. - చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీ వారసులే అని.. B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ అని ఆమె అన్నారు. ఆంధ్ర నా పుట్టిన ఇళ్లు...తెలంగాణ నా మెట్టినిల్లు అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం, ఏపీలో ప్రశ్నించే గొంతుక కోసం YSR బిడ్డ తిరిగి వచ్చిందన్నారు. 

షర్మిల మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తోనే హోదా సాధ్యం. 10 ఏళ్లు హోదా ఇస్తామని మాట తీసుకొని ఇక్కడకు అడుగు పెట్టాను. అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వృద్దులకు 4 వేలు పెన్షన్, వికలాంగులకు 6 వేల పెన్షన్ ఇస్తాం. ప్రతి పేద మహిళ ఫ్యామిలీకి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. రాజమండ్రి ఎంపీగా గిడుగు రుద్రరాజు ను భారీ మెజారిటీ తో గెలిపించండి. అవసరం అయితే హోదా కోసం ఢిల్లీలో గిడుగు నిరాహార దీక్ష చేస్తాడు’ అన్నారు.


Sharmila About Jagan: ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడు, బీజేపీకి తొత్తు - రాజమండ్రిలో వైఎస్ షర్మిల ఫైర్

‘10 ఏళ్లు అయినా ఏపీ అభివృద్ది లో ఒక్కడుగు ముందుకు పడలేదు. 10 కొత్త పరిశ్రమలు రాలేదు. హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రం అభివృద్ది చెందేది. హోదా రాకుంటే చంద్రబాబు, జగన్ గాడిదలు కాశారు. 15 ఏళ్లు హోదా కావాలని చంద్రబాబు అడిగారు. అధికారంలో వచ్చాకా హోదా అడిగితే జైల్లో పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని జగన్ అన్నాడు. అధికారం ఇస్తే 5 ఏళ్లలో నిజమైన ఉద్యమం ఒక్కటి చేయలేదు. రాజకీయం కోసం హోదా అనే అంశాన్ని వాడుకున్నారు. నమ్మి ఓట్లు వేస్తే కనీసం రాజధాని కట్టలేదు. చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధాని కడతామని అమరావతిని కాస్త బ్రమరావతి చేశారు. మూడు రాజధానులు అన్న జగన్.. కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు.’ వైఎస్ షర్మిలా రెడ్డి 

ఏపీకి బీజేపీ వెన్నుపోటు
ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ వెన్నుపోటు పొడిస్తే.. ఎవరూ నిలదేయలేదు అని షర్మిల అన్నారు.  ఇంత అన్యాయం చేసినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు, జగన్ బీజేపీకి తొత్తు.. ఇద్దరు బీజేపీ కి బానిసలు గా మారారని.. జగన్ బీజేపీ కి దత్త పుత్రుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు గోద్రా ఘటన మీద YSR బీజేపీని ఉతికి ఆరేశాడు. కానీ YSR వారసుడు మణిపూర్ ఘటన మీద మాట కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేశాడని విమర్శించారు. 23 వేల ఉద్యోగాలని చెప్పి ముష్టి 7 వేలకు నోటిఫికేషన్ ఇచ్చారని.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమి ఇప్పుడు లేచారంటూ సెటైర్లు వేశారు.

ఓట్లు కావాలని సిద్ధం అని జగనన్న బయలు దేరాడు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం, మద్య నిషేధం అని కల్తీ మద్యం అమ్మడానికా ? ఉద్యోగాల పేరు చెప్పి మళ్ళీ మోసం చెయడానికా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పులు చేయటానికి సిద్ధమా, ప్రజలను మళ్ళీ మోసం చేయడానికా? మీరు సిద్ధం అయితే.. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధం అన్నారు షర్మిల. రాష్ట్రాన్ని డ్రగ్స్ కి అడ్డాగా మార్చి కంటైనర్ లో డ్రగ్స్ తరలిస్తున్నారని ఆరోపించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను కలిసిన ప్రొడ్యూసర్స్ - సింగిల్ స్క్రీన్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూపై...
పవన్ కల్యాణ్‌ను కలిసిన ప్రొడ్యూసర్స్ - సింగిల్ స్క్రీన్స్, ఎగ్జిబిటర్స్ ఇష్యూపై...
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం
గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
Embed widget