అన్వేషించండి

Weather Updates: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు

Telangana Weather Today | దాదాపు వారం రోజుల విరామం తరువాత తెలంగాణలో నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rains In Andhra Pradesh | అమరావతి / హైదరాబాద్: దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ గఢ్, ఒడిశాలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్  లతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులపాటు దానా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మూడు, నాలుగు రోజులనుంచి తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది. 

ఏపీ, యానాంకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ తో పాటు యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీచనున్నాయి.  కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది.

తెలంగాణలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులనుంచి వాతావరణంలో ఏ మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం సాయంత్రం లేక రాత్రి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అయితే తేలికపాటి జల్లులే కావడంతో ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు. వర్షాల కోసం ఎదురుచూసే రైతులకు నిరాశ తప్పదు. పంట దిగుబడికి సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

తెలంగాణలో పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఉక్కపోత అధికమవుతోంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు నమోదు కాగా, రాత్రిపూట 21.2 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు ఖమ్మం, భద్రాచలంలో 35 డిగ్రీలు నమోదు కాగా, 30 డిగ్రీలతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో 34.5 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 33.3 డిగ్రీలు, హన్మకొండ, రామగుండంలో 33 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్ చెరులో కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆపై మెదక్ లో 18.8 డిగ్రీలు, రాజేంద్రనగర్ లో 19.5 డిగ్రీలు మాత్రమే 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన కేంద్రాలుగా ఉన్నాయి.

Also Read: Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget