అన్వేషించండి

Jagan Case : రఘురామ తప్పుడు ఫిర్యాదు - జగన్ పై కక్షతోనే కేసులు - మాజీ ఏఏజీ పొన్నవోలు ఆరోపణ

Andhra Pradesh : జగన్ పై కుట్రతోనే కేసు పెట్టారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రఘురామ ఫిర్యాదుపై నమోదైన కేసు గురించి ఆయన వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

Ponnavolu Sudhakar Reddy :  సీఐడీ అధికారుల కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామకృష్ణరాజు చేసిన  పిటిషన్ పై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఆ పార్టీ నేత, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. రఘురామకృష్ణరాజు పదకొండో తేదీన ఫిర్యాదు చేస్తే.. పదో తేదీనే లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లగా చెప్పారని..ఇది ఎలా సాధ్యమని ాయన ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం సాక్ష్యం ఉంటుందని పొన్నవోలు ప్రశ్నించారు.  

రఘురామన అరెస్టు చేయడంలో తప్పు జరగలదేన్న పొన్నవోలు                               

వైఎస్ జగన్ తో పాటు మరికొందరు అధికారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. ఈ కేసుల వెనుక దురుద్దేశం..రాజకీయ కక్ష మాత్రమే ఉందన్నారు. వ్యక్తిగత ద్వేషంతో రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. సీఐడీ అధికారులు రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేసి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ఉంచారని అందులో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. 

అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆరోపణ - ఇప్పుడు జగన్ పేరు చెప్పారు                         

తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ కృష్ణరాజు మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.  ఇప్పుడేమో కేసులో  జగన్ పేరు రాశాన్నారు.  జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని  అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదని  పొన్నవోలు ప్రశ్నించారు. అప్పట్లోనే కోర్టు రఘురామను వైద్య పరీక్షలకు పంపిందని.. గాయాలేమీ లేవని వైద్యులు నివేదిక ఇచ్చారన్నారు. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని.. మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో ‌జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారని   పొన్నవోలు నిలదీశారు.    ఇబ్బందులు పెట్టాలన్న కక్షతోనే  తప్పుడు కేసు పెట్టారని ఇది వ్యవస్థకు మంచిది కాదన్నారు. అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరని అన్నారు. 

తనపై కస్టోడియల్ టార్చర్ విషయంలో సుదీర్ఘంగా పోరాడుతున్న రఘురామ                                             

రఘురామ తనపై కస్టోడియల్ టార్చర్ విషయంలో సుదీర్ఘంగా పోరాడుతున్నారు. కాల్ రికార్డులు కూడా భద్రపరచాలని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీసులు కేసు నమోదు  చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Retired Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణహత్య- భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె మీద అనుమానం !
Ayush Mhatre Record: నిన్న వైభవ్,  నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
నిన్న వైభవ్, నేడు ఆయుష్ మాత్రే.. ఐపీఎల్‌లో మరో యువ సంచలనం అరంగేట్రం
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
విరాట్ కోహ్లీ ఆన్ ఫైర్, చివరివరకూ ఉండి పంజాబ్‌పై రివేంజ్ విక్టరీ అందించిన ఛేజ్ మాస్టర్
Embed widget