అన్వేషించండి

Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Andhra Pradesh News | పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, సైన్ బోర్డుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ  తన ' x '' హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.               

"కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్ శాఖ లోగో, ఉపాధి హామీ పథకం లోగో ఉండేలా చూడగలరు. ఖచ్చితంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యక్రమాల్లో ఈ ప్రోటోకాల్ పాటించాలి. అలాగే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం ఈ విషయంలో పర్యవేక్షణ చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు" అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

ప్రూఫ్ సరి చూసుకోరా?
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన హోర్డింగ్స్, వాల్ పోస్టర్స్  రెడీ చేసేటప్పుడు అధికారులు ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. యాడ్ రెడీ అయ్యాక సంబంధిత శాఖ కమీషనర్ లేదా డైరెక్టర్ ఓకే చేశాక మాత్రమే దాన్ని రిలీజ్ చేస్తారు. అలాంటిది ఇంత ముఖ్యమైన హోర్డింగ్స్ రిలీజ్ చేసేటప్పుడు ఏకంగా ప్రధాని మోదీ ఫోటో పెట్టకపోవడం అనేది పెద్ద విషయమే. ఇది పొరపాటుగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగానే మోదీ ఫోటో లేపేసారా అనేది తెలియాల్సి ఉంది. పొరబాటున జరిగిన విషయమైతే పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

గతంలోనూ ఇదే పొరపాటు  
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారం లోకి వచ్చిన టీడీపీ, 2019 తర్వాత పవర్ చేపట్టిన వైసీపీ కూడా ఇదే పొరపాటు చేశాయి. కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం  చాలా దారుణం అంటూ అప్పటి రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ లాంటివాళ్ళు విమర్శించేవారు. ఒకానొక దశలో బిజెపి, టీడీపీల మధ్య ఈ అంశమే విభేదాలకు కూడా కారణమైంది. ఏపీ అనే కాదు  తెలంగాణ లోనూ ఇదే తంతు. తామిచ్చే నిధులతో చేపట్టే కార్యక్రమాలలో ప్రధాని ఫోటో ఎందుకు ఉండదంటూ ఏకంగా ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ నేరుగా విమర్శలు గుప్పించిన సంఘటనలు గతంలో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫేజ్ ముగిసిపోయిందనుకున్న దశలో మళ్లీ ఏపీ ప్రభుత్వ అధికారులు ఇలా కీలకమైన అంశాల్లో ప్రధాని మోడీ ఫోటో లేకుండా చేయడం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కోపం తెప్పించిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Jharkhand Assembly Elections : జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Bollywood: దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరంఫ్రెండ్‌ని కాపాడిన రతన్ టాటా, పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తిభారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Jharkhand Assembly Elections : జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Bollywood: దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
Damagundam Radar Center Foundation: దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
Kurnool news : కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
Embed widget