అన్వేషించండి

Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక

ఆనం, కోటంరెడ్డి ఆరోపణలపై డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు.

 

Pawan Kalyan On Anam :  ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్న డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు , ట్యాపింగ్ వ్యవహారాలపై పవన్ తొలి సారి స్పందించారు. ఎమ్మెల్యేలే ప్రాణభయంతో వణికిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు  భద్రత లేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని నేరుగా సీఎం.. ఆయన కార్యాలయంపైనే ఆరోపణలు చేశారన్నారు. సొంత ఎమ్మెల్యేలపై నిఘాలు, సంభాషణలు దొంగ చాటుగా వినడం.. అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయని జగన్ పై మండిపడ్డారు. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా డీజీపీ, హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని పవన్ ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై డీజీపీ స్పందించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. 
 

 

వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నరగా తన ఫోన్ ట్యాప్ చేస్తోందని.. భద్రత తగ్గించారని ప్రాణభయం ఉందని  ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు.  ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను మార్చడంతో పాటూ తన భద్రతను కూడా తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ప్రమేయం లేకుండానే సెక్యూరిటీని తొలగించారని తెలిపారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉందని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని   ఆధారాలు కూడా బయట పెట్టారు.  ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు  దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ట్యాప్ చేస్తారని, ప్రభుత్వ పెద్దలే ఫ్లోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఆయన నేరుగా సీఎం జగన్, సజ్జల, సీఎంవో కార్యాలయంపైనే ఆరోపణలు చేశారు. అంతేకాదు 35మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు కూడా తనకు ఫోన్ చేశారని.. వాళ్ల ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని తనతో చెప్పినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని..  ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ ఈ అంశాలపైనే లేఖ రాశారు.             

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Embed widget