అన్వేషించండి

Paritala Ravi : పరిటాల రవి చివరి కోరిక తీరలేదు.. ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉంది ! స్క్రిప్టేమిటనుకుంటున్నారా.. అదే ట్విస్ట్...

పరిటాల రవి చివరి కోరిక చెంఘిజ్ ఖాన్ సినిమా నిర్మాణం. ఆ పనుల్లో ఉండగానే హత్యకు గురయ్యారు. ఆయన వర్థంతి సందర్భంగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..


మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి 17వ వర్థంతి కరోనా నిబంధనలను పాటిస్తూ నిరాడంబరంగా చేసుకున్నారు. పరిటాల రవికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమా స్టార్ కాకుండా ఆ తరహా మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతల్లో పరిటాల రవి ఒకరు.  ఆయన హత్యకు గురయ్యే నాటికి ఓ పనిని చేయాలని బలంగా సంకల్పించారు. అదే ఆయన చివరి కోరికగా మిగిలిపోయింది. పని కూడా ప్రారంభించారు. కానీ మధ్యలో ఆగిపోయింది.

Also Read: సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !

స్నేహలతా ఫిలింస్‌ పేరిట పరిటాల రవి  ఓ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.  ఆ బ్యానర్‌పైన శంకర్‌ దర్శకత్వంలో.. 'శ్రీరాములయ్య' అనే పేరుతో తన తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఆ రోజుల్లో అది సూపర్‌ హిట్‌ అయింది. అదే ఊపులో  పరిటాల రవి తమ సొంత బ్యానర్‌లో మరో సినిమాను తీయాలని నిర్ణయించారు. దీనికోసం కథను కూడా సిద్ధం చేసుకున్నారు. స్వతహాగా  పుస్తకాలు చదివే అలవాటున్న రవికి  తెన్నేటి సూరి రచించిన చెంఘిజ్‌ఖాన్‌ నవల విపరీతంగా నచ్చింది. దాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఆ నవల కాపీరైట్స్‌ని తెన్నేటి సూరి తనయుడు తెన్నేటి విశ్వం నుంచి కొనుగోలు చేశారు. 

Also Read: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు

చెంఘిజ్ ఖాన్ నవలను సినిమాకు తగ్గట్లుగా మార్పు చేర్పులు చేస్తూ ఎవర్ని హీరోగా పెట్టాలన్నదానిపై చర్చలు కూడా జరిపారు. చెంఘిజ్ ఖాన్ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా శ్రీహరిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఈలోపే పరిటాల రవి శత్రువులు, ఆయన్ను అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హత్య చేశారు. అలా.. ఆయన శ్వాసతో పాటే, చెంఘిజ్‌ఖాన్‌ సినిమా ప్రయత్నమూ ఆగిపోయింది. తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు. ఈ నవలపై కాపీ రైట్స్ పరిటాల రవి కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నాయి. చెంఘిజ్‌ఖాన్‌ని తెరకెక్కించే ప్రయత్నం మాత్రం ముందుకు సాగలేదు.

Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?

పరిటాల రవి క్రమశిక్షణకు చాలా విలువ ఇచ్చేవారు. 2004లో కరువు కారణంగా  పేదల ఇంట పెళ్లిళ్లు జరగడం లేదని తెలుసుకుని 108 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. దానికి ముందస్తుగా జరగుతున్న ఏర్పాట్ల కవరేజీ కోసం వెళ్లిన పాత్రికేయులకు వింతైన సన్నివేశం కనిపించింది. సూటుబూటు వేసుకుని, టైలు కట్టుకుని ఎగ్జిక్యూటివ్స్‌లా ఉన్న కొందరు యువకులు, పెళ్లి జరిగే ముత్యలమ్మ గుడి దగ్గర అతిథుల చెప్పులు శుభ్రం చేస్తూ కనిపించారు. ఎందుకిలా అని ఆరా తీస్తే..  అంతకు ముందు అప్పగించిన పనిని సరిగా  చేయకపోవడంతో పరిటాల రవికి గుడికి వచ్చీ వెళ్లే వారి చెప్పులు శుభ్రం చేయమని చెప్పారట. ఆయన ఆ మాట అనడమే తరువాయిగా యువకులు, నామోషీ అనుకోకుండా, పనిలోకి దిగిపోయారు.  వారంతా అప్పటికే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. పరిటాల రవి అభిమానులు. ఈ సన్నివేశం చూశాక, పరిటాల రవి క్రమశిక్షణకు ఇచ్చే విలువ, తన అభిమానులకు దాన్ని ప్రేమగా అలవాటు చేసే విధానం .. పాత్రికేయులకు తెలిసొచ్చింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget