అన్వేషించండి

Sarpanch Movement: నిధులు వచ్చే వరకు ఊరుకునేది లేదు, ఛలో దిల్లీకి సర్పంచుల కార్యాచరణ - తీర్మానాలివే

Sarpanch Movement: దారి మళ్లించిన పంచాయతీల నిధులను తిరిగి జమ చేసే వరకు పోరాటం చేస్తామని సర్పంచులు ప్రకటించారు. దిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర మంత్రులకు తమ సమస్యలు వివరిస్తామన్నారు.

Sarpanch Movement: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు సర్పంచులు సిద్ధమయ్యారు. తమకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు చేస్తున్న సర్పంచులు ఆ నిధులు తిరిగి పంచాయతీలకు ఖర్చు పెట్టే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 8 వేల 660 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను తిరిగి  పంచాయతీల ఖాతాలకు జమ చేసే దాకా పోరాటం చేస్తామని  వెల్లడించారు. తిరుపతి నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో సర్పంచులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో జరిగిన పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశంలో 2 రోజుల్లో 12 తీర్మానాలను సర్పంచులు ఆమోదించారు. 

ఫిబ్రవరిలో ఛలో దిల్లీ..

దారి మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీలకు ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని తిరుమల శ్రీవారిని కోరుతూ ఈ నెల ఆఖరులో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో అన్ని రాజకీయ పార్టీలతో, సంఘాలతో విజయవాడలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ మేరకు సర్పంచులు ప్రకటన విడుదల చేశారు. 

జగన్, బాబు, పవన్ సహా మిగతా నేతలకూ ఆహ్వానం

ఈ అఖిల పక్ష సమావేశానికి  సీఎం వైఎస్ జగన్ ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఇతర పార్టీల నాయకులు అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాలని  ఛాంబర్ కమిటీ సమావేశంలో సర్పంచులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి నుండి ప్రారంభించాలని తలపించిన ఛలో దిల్లీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్దం చేసుకున్నారు. దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సమస్యలను తీసుకు వెళ్లాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా విశాఖ జిల్లా గంభీరం గ్రామ సర్పంచి వానపల్లి లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆమెకు వైబీబీ రాజేంద్ర ప్రసాద్ నియామక పత్రాన్ని అందించారు. ఉపాధి హామీ పథకం పనులను, నిధులను మళ్లీ గ్రామ పంచాయతీల ఆధీనంలోకి తీసుకు రావాలని సర్పంచ్ లు తీర్మానం చేశారు. 

పంచాయతీరాజ్  ఛాంబర్ రాష్ట్ర కమిటీ తీర్మానాలు:

1. మైనర్ పంచాయతీలకు తాగు నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు రాష్ట్ర  ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలి.

2. గ్రామ సచివాలయాలతో పాటు వాలంటీర్లను పంచాయతీల పరిధిలో చేర్చాలి.

3. సిబ్బంది విధులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణాధికారాల్ని సర్పంచులకు అప్పగించాలి.

4. సర్పంచ్, ఎంపీటీసీలకు 15 వేల రూపాయలు గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీలకు 30 వేల రూపాయలు, జడ్పీ ఛైర్మన్ లకు 2 లక్షల రూపాయల గౌరవ వేతనం అందించాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget