By: ABP Desam | Updated at : 01 May 2022 10:34 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి విడదల రజిని(ఫైల్ ఫొటో)
Minister Vidadala Rajini : రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రేపల్లె ఘటన అత్యంత బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబానికి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. బాధ్యులపై చర్యల విషయంతో పాటు బాధితురాలి ఆరోగ్యంపై కూడా సీఎం ఆరా తీశారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు.
"సీఎం జగన్ ఇలాంటి ఘటనలను ఉపేక్షించరు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాం." అని మంత్రి తెలిపారు.
ముగ్గురు నిందితుల అరెస్టు
రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహిత గ్యాంగ్ రేప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువకులు కాగా, ఓ మైనర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ నిందితుల అరెస్టు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 376(డీ), 394, 307, R/w 34 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని బాపట్ల ఎస్పీ స్పష్టం చేశారు. తమ పిల్లలతో భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్కు అర్ధరాత్రి చేరుకోగా, ఒంటిగంట సమయంలో అత్యాచార ఘటన జరిగింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కేసు దర్యాప్తు చేశామని, నిందితుడు చొక్కా మార్చుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్కు రాగానే పోలీసులు రైల్వేస్టేషన్కు వెళ్లారు. ఈ సామూహిక అత్యాచార కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.
టైమ్ అడిగే వంకతో గొడవ
అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న బాధితురాలి భర్త వద్దకు నిందితులు వచ్చారు. టైమ్ అడిగి బాధితురాలి భర్తతో వివాదం పెట్టుకున్నారు. తనకు వాచీ లేదని చెప్పడంతో అతడిపై దాడిచేసి అతడి వద్ద నుంచి రూ.750 లాక్కున్నారు. అంతటితో ఆగని నిందితులు ఆ వ్యక్తి భార్యను జుట్టు పట్టుకుని ప్లాట్ ఫారమ్ చివరకు లాక్కెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె భర్తపై దాడి చేయడంతో అతడు స్థానికుల సాయంతో రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని తెలిపి, ఫిర్యాదు చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు జాగిలాలు, ఇతర ఆధారాల ద్వారా నిందితులను పోలీసులు ఆదివారం ఉదయం గుర్తించినట్లు వివరించారు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం
Rajahmundry Airport: రూ.347 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులు: మార్గాని భరత్
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>