అన్వేషించండి

Vikrama Simhapuri University: ఈ యూనివర్శిటీలో వందకు రెండొందల మార్కులొస్తాయ్! ఆ రిజల్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది

పరీక్షల్లో ఫెయిలైనా విద్యార్థులు పెద్దగా కంగారు పడేవారు కాదేమో. వందకు రెండొందల మార్కులు వచ్చే సరికి వారు షాకయ్యారు. అన్ని పరీక్షల్లో కలిపి 800 గరిష్ట మార్కులకు ఓ విద్యార్థికి 5360 వచ్చాయి.

వందకు వందమార్కులు వేస్తే పేపర్ ఎంత బాగా రాశారో అనుకోవచ్చు. వందకు రెండొందల మార్కులు వేస్తే పరీక్ష రాసినవారి గురించి కాదు, పేపర్ దిద్దినవారి గురించి ఆలోచించాలి. ఇప్పుడు నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ (VSU) కూడా ఇలాగే వార్తల్లోకెక్కింది. గతంలో డబ్బులు తీసుకుని పరీక్షల్లో పాస్ మార్కులు వేస్తారనే ఆరోపణలు యూనివర్శిటీ సిబ్బందిపై ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వందకు వేల వేల మార్కులు వేసి మరో రకంగా ట్విస్ట్ ఇచ్చారు అధికారులు.

అసలేం జరిగింది..?

ఎనిమిది నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు జరిగాయి. సహజంగా ఈ యూనివర్శిటీలో మూల్యాంకనం, మార్కుల ప్రకటన బాగా ఆలస్యం. ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. VSU పరిధిలో 69 డిగ్రీ కాలేజీలు ఉండగా, 30వేల మంది విద్యార్థులు ఈ సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఫలితాలను గత శుక్రవారం విడుదల చేశారు. వాటిని ఆన్ లైన్ లో చూసుకున్న విద్యార్థులు షాకయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా 200మంది ఖంగుతిన్నారు. వెంటనే వారు యూనివర్శిటీకి పరుగులు పెట్టారు.

పరీక్షల్లో ఫెయిలైనా అంతగా కంగారు పడేవారు కాదేమో. వందకు రెండొందల మార్కులు వచ్చే సరికి వారు షాకయ్యారు. అన్ని పరీక్షల్లో కలిపి 800 గరిష్ట మార్కులకు ఓ విద్యార్థికి 5360 వచ్చాయి. మరో విద్యార్థికి 600 మార్కులకు గాను 6138 వేశారు. దీంతో వారంతా వెంటనే యూనివర్శిటీకి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. మార్కులు బాగానే వేశారు కానీ మరీ ఎక్కువయ్యాయని నిలదీశారు.

ఇది కేవలం 200మంది సమస్యే కాదు, అంతకు మించి చాలామందికే ఇలా తప్పులు దొర్లి ఉంటాయి. కానీ శుక్రవారం తర్వాత వరుస సెలవలు ఉండటంతో చాలామందికి రిజల్ట్ విషయం తెలియదు. విద్యార్థులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుని మార్కులు చూసుకున్నారు. వెంటనే వారంతా యూనివర్శిటీకి వెళ్లి అధికారులను కలవడంతో వారు ఫలితాలను ఆన్ లైన్ నుంచి తొలగించారు. అంటే అసలు విషయం బయటపడేలోపు దాన్ని కవర్ చేసుకున్నారు.

టెక్నికల్ ఎర్రర్..

దీన్ని టెక్నికల్ ఎర్రర్ అని చెబుతున్నారు యూనివర్శిటీ అధికారులు. 150మందికి ఇలా తప్పుగా ఫలితాలు వచ్చాయని, వాటన్నిటినీ సరిదిద్దామని చెప్పారు. యూనివర్శిటీ పరీక్షల నిర్వహణ అధికారి ప్రభాకర్ ఈమేరకు వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో వైరల్..

పరీక్షల్లో విద్యార్థులకు తప్పుడు మార్కులు రావడంపై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించడానికి తర్జన భర్జనలు పడ్డారు. అసలు ఆన్ లైన్ లో మార్కులు లేవు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సర్దిచెప్పి పంపించిన తర్వాత ఈ వ్యవహారం బయటపడేసరికి చివరకు తప్పైపోయినట్టు చెబుతున్నారు. కేవలం సాంకేతిక సమస్య వల్లే ఇలా తప్పుగా మార్కులు ఆన్ లైన్ లో నమోదయ్యాయని, వాటిని తొలగించి కొత్త జాబితా పెడుతున్నామని చెప్పారు.

యూనివర్శిటీ వ్యవహారంపై స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన కూడా ఇదే యూనివర్శిటీ పీహెచ్డీ విద్యార్థి. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంత యూనివర్శిటీ అధికారులు హడావిడిపడ్డారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget