అన్వేషించండి

Nellore Tragedy: నెల్లూరులో విషాదం, పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు దుర్మరణం!

పిల్లలను కాపాడే క్రమంలో వారు గుంతల్లో మునిగిపోయారు. పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారనే వార్త సంతోషాన్నిచ్చినా, వారి తల్లులు అవే గుంతల్లో మునిగి ప్రాణాలొదిలారు. చివరికి వారి మృతదేహాలను వెలికితీశారు. 

నెల్లూరు నగర పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతల్లో పడిన ఇద్దరు పిల్లలను కాపాడి, వారి తల్లులు ప్రాణాలొదిలారు. వేసవి సెలవలు కావడంతో భగత్ సింగ్ నగర్ కాలనీలోని పిల్లలు పక్కనే ఉన్న పెన్నాలో ఈతకు వెళ్తున్నారు. అయితే ఇటీవల ఇక్కడ పెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. దీనికోసం గుంతలు తవ్వారు. ఈ గుంతల్లో ఈతకోసం వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, విషయం తెలిసిన వారి తల్లులు వెంటనే అక్కడికి వచ్చారు. పిల్లలకోసం ఆ గుంతల్లో దూకారు. పిల్లలిద్దర్నీ జాగ్రత్తగా ఒడ్డుకి చేర్చారు. అయితే ఆ తర్వాత ఆ ఇసుక గుంతల్లోనుంచి బయటకు రావడం వారికి సాధ్యం కాలేదు. ఊబిలాగా ఉండటంతో క్రమక్రమంగా ఆ ఇసుకలోకే ఒరిగిపోయారు. పిల్లలకోసం వెళ్లిన తల్లులు ప్రాణాలొదిలారు. 

పెన్నాకు ఎప్పుడు వరదలొచ్చినా నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ మునిగిపోతుంది. ఆమధ్య పెన్నాకు భారీ వరదల కారణంగా భగత్ సింగ్ కాలనీ సగానికి పైగా నీళ్లు వచ్చాయి. ఎక్కడివారక్కడ తట్టాబుట్టా సర్దుకుని వలస వెళ్లారు. తిరిగి నీరు తగ్గగానే అదే ప్రాంతానికి వచ్చారు. వారందరికీ పునరావాసం కల్పిస్తామని సీఎం జగన్ స్వయానా హామీ ఇచ్చారు. ఆయన కూడా భగత్ సింగ్ కాలనీకి వచ్చి వారిని పరామర్శించారు. జగన్ పర్యటనలో స్థానిక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఆయనే జలవనరుల శాఖ మంత్రి కావడం, పెన్నా వరద ప్రాంతం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో చకచకా ఫైల్స్ కదిలాయి. రిటైనింగ్ వాల్ విషయంలో సీఎం జగన్ కూడా స్థానికులకు హామీ ఇవ్వడంతో ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. కానీ అవి నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకూ పనుల్లో పురోగతి లేదు. ఇటీవల ఆ రిటైనింగ్ వాల్ కోసం గుంతలు తవ్వారు. కానీ వాటి వద్ద ప్రమాద సూచికలేవీ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అంటున్నారు. 

భగత్ సింగ్ నగర్ కి చెందిన షాహినా, షబీనా ఇరుగుపొరుగు వారే. వారి పిల్లలు పెన్నాలో ఈతకు వెళ్లారని, గుంతల్లో చిక్కుకుపోయారనే సమాచారంతో వెంటనే పరుగు పరుగున వారు అక్కడికి వచ్చారు. అయితే పిల్లలను కాపాడే క్రమంలో వారు గుంతల్లో మునిగిపోయారు. పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారనే వార్త సంతోషాన్నిచ్చినా, వారి తల్లులు మాత్రం అవే గుంతల్లో మునిగి ప్రాణాలొదిలారు. చివరికి వారి మృతదేహాలను వెలికితీశారు. 

అనిల్ పై ఆరోపణలు.. 
ఈ విషయం తెలిసిన వెంటనే నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వామపక్షాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భగత్ సింగ్ నగర్ లో బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. ఎమ్మెల్యే అనిల్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి అయ్యారని, అనిల్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు నెల్లూరు సిటీ టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. రక్షణ గోడ నిర్మాణ ప్రదేశంలో కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.  సిటీ ఎమ్మెల్యే అనిల్ వల్ల రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలకు చెరో 50లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడప గడపకు భగత్ సింగ్ కాలనీకి వచ్చిన అనిల్.. మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణం అని విమర్శించారు టీడీపీ నేతలు. పొలిటికల్ మైలేజ్ కోసం పనులు స్టార్ట్ చేసి.. కనీసం సూచిక బోర్డులు కూడా పెట్టలేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్Travis Head Century vs RCB IPL 2024: రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ లో మరోసారి బలైన RCB, 25 పరుగులతో ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
IPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
Hyderabad News: మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
Pawan Kalyan: సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్
Embed widget