అన్వేషించండి

Nellore Covid Cases: కరోనా కొత్త వేరియంట్‌ అలర్ట్! నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక వార్డులు

Covid Cases Latest: కరోనా కొత్త వేరియంట్‌ JN-1 వ్యాప్తి వార్తల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు.

New Covid Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని వివరించారు అధికారులు. ఏపీలోని 12 మెడికల్‌ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామ సచివాలయానికి 10 ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచారు. ఇటు జిల్లా స్థాయిలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు అధికారులు. ఈమేరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

కరోనా కొత్త వేరియంట్‌ JN-1 వ్యాప్తి వార్తల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. కేంద్రం హెచ్చరికలతో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీఎస్‌ నాయక్‌.. వైద్యులు, సిబ్బందితో సమావేశమై కొత్త వేరియంట్‌ పై వివరాలు తెలియజేశారు. ఇలాంట్ సమయంలో ఎవరూ సెలవలు తీసుకోవద్దని చెప్పారు. ప్రతి వైద్యుడు కచ్చితంగా విధులకు హాజరుకావాలని సూచించారు. కరోనా కేసులు తమ పరిధి కాదని చెప్పకుండా.. ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని స్పష్టం చేశారు సూపరింటెండెంట్. 

నెల్లూరు జీజీహెచ్‌ లో రెండు ప్రత్యేక వార్డులు
కొవిడ్‌ కేసులను ఎదుర్కొనేందుకు.. నెల్లూరు జీజీహెచ్‌లో రెండు ప్రత్యేక వార్డులు కేటాయించారు. వాటిలో మొత్తం 320 పడకలు ఏర్పాటు చేశారు. పల్మనాలజీ విభాగంలో 100 పడకలు, జనరల్‌ మెడిసిన్‌లో 220 పడకలు కొవిడ్ పేషెంట్స్ కోసం సిద్ధం చేశారు. ఆసుపత్రిలో మొత్తం 750 పడకలు ఉన్నాయి. ఒకవేళ కొవిడ్ విజృంభించి కేసులు ఎక్కువయితే.. మిగతా వార్డుల్లో కూడా తాత్కాలికంగా బెడ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో 13 కేఎల్‌, 10 కేఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో 300కుపైగా వెంటిలేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డులను అదనంగా సిద్ధం చేస్తున్నారు వైద్యశాఖ అధికారులు. 

శబరిమల భక్తుల విషయంలో..
వైరస్‌ ట్రాన్స్‌ఫర్‌ మీడియా(VTM)కు వైద్యులు సిద్ధమయ్యారు. రోగికి వైరస్‌ సోకిన తర్వాత, వారినుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టారు. కేరళలో ఈ JN-1 వైరస్‌ ను గుర్తించడం.. ఇటీవల కాలంలో పలువురు భక్తులు శబరిమలకు వెళ్లి రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. శబరిమల వెళ్లివచ్చిన వారిని గుర్తించి.. పరీక్షలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఏపీలో ఎవరికీ ఈ JN-1 వైరస్ సోకినట్టు నిర్థారణ కాలేదు. జిల్లాలో కూడా కేసులు లేవు, ఒకవేళ కేసులు వెలుగు చూస్తే, ఆ కేసులకు కేరళకు సంబంధం ఉందని తెలిస్తే.. శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన భక్తుల వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తామంటున్నారు వైద్యులు. 

మళ్లీ మాస్క్ నిబంధన..
నెల్లూరు జిల్లాలో మళ్లీ మాస్క్ నిబంధన తెరపైకి వచ్చేలా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని వైద్య అధికారులు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. బయటనుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు వైద్యులు. శానిటైజర్ వాడకం అలవాటు చేసుకోవాలన్నారు. 

ఇక ఏపీలో మొత్తంగా 33 వేలకి పైగా ఆక్సిజన్‌ బెడ్స్‌, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర అధికారులు ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్లకు, కొవిడ్‌ మందులకి కొరత లేదన్నారు. జ్వరంతో బాధ పడుతున్న రోగులను ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షించి అందులో పాజిటివ్‌ వస్తే ఆయా శాంపిల్స్‌ ని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్ లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో కొవిడ్‌ వేరియంట్‌ తెలుసుకోవాలంటే దాన్ని విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ కి పంపించాల్సి ఉంటుంది. పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు JN-1 కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఆయా లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget