అన్వేషించండి

AP News: అయ్యప్ప భక్తుడి సాహసం.. ఒకే కాలుతో 750 కి.మీ. నడిచి శబరిమలకు.. కారణం ఏంటంటే..

నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు కాలి నడకన పయనం అయ్యాడు. రెండు రోజుల క్రితమే యాత్ర పూర్తయింది.

అయ్యప్ప భక్తులు ఏటా స్వామి దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి దర్శనం చేసుకోవడం మామూలే. ఇలా దీక్ష చేపట్టిన ఇంకొందరు తమ ఊరి నుంచి కాలినడకన శబరిమలకు వెళ్తుండడం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఇలాంటివారు అయ్యప్ప దీక్ష మొదలుపెట్టిన నాటి నుంచే శబరిమలకు నడక ప్రారంభిస్తారు. రోజుల తరబడి వారి ప్రయాణం సాగి దీక్షా కాలం పూర్తయ్యే నాటికి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. కానీ, ఈ పరమ భక్తుడు మాత్రం అంతకుమించిన భక్తి చూపాడు. తాను విభిన్న ప్రతిభావంతుడైనా కాలి నడకన నెల్లూరు నుంచి శబరిమలకు చేరుకున్నాడు. ఏకంగా 750 కిలో మీటర్ల ఒంటి కాలుతో నడిచి స్వామిని చేరుకున్నాడు.

నెల్లూరు నగరానికి చెందిన అకరపాక సురేష్‌ దివ్యాంగుడు. గతంలో ప్రమాదవశాత్తు ఒక కాలును కోల్పోయాడు. తనకు గతంలో ఉన్న వ్యసనాల నుంచి కాపాడటంతోపాటు సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవంతో కూడిన గుర్తింపు వచ్చిందని అతను నమ్మాడు. అందుకు కారణం అయ్యప్ప స్వామి అని భావించాడు. అందుకే ఆ స్వామిని దర్శించుకునేందుకు ఏకంగా 750 కిలో మీటర్లు ఒంటి కాలుతో నడిచి అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు.

గతేడాది 2021 సెప్టెంబరు 20న నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు కాలి నడకన పయనం అయ్యాడు. కరోనా కేసులు పెరుగుతున్నా, కాలి నడకలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని తెలిసినా వాటిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో మనసంతా అయ్యప్పస్వామిని నింపుకుని చివరికి గమ్యం చేరాడు. పవిత్రమైన ఇరుముడిని తలపై మోస్తూ ఊతకర్రల సాయంతో ఒక్కడే నడుచుకుంటూ దాదాపు 105 రోజులు శ్రమించి తన పాదయాత్ర కొనసాగించాడు. 

గత సెప్టెంబరులో మొదలైన పాదయాత్ర రెండు రోజుల క్రితమే పూర్తయింది. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు బయలుదేరి ఎండ వచ్చే సమయానికి ఏదో ఒక ఆలయానికి చేరుకునేవాడు. అక్కడ విశ్రాంతి తీసుకొని, భిక్ష చేసిన తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగించేవాడు. రాత్రి కూడా ఆలయాలే విశ్రాంతి కేంద్రాలయ్యేవి. ఇప్పటికే చాలాసార్లు ఈయన అయ్యప్ప దీక్ష చేపట్టినా.. నడిచి వెళ్లడం మాత్రం ఇది రెండోసారి అని తెలిపారు. శబరిమల ఆలయ సిబ్బంది కూడా సురేష్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు

Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!

Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?

Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Andhra Pradesh Latest News:ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!
ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు- సీఆర్డీఏకు కొత్త బాస్‌!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget