అన్వేషించండి

Govt on Ration Shops: రేషన్ దుకాణాలు మూసివేయడం లేదంటూ మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ!

Govt on Ration Shops: ఏపీలో మొత్తం 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందుతున్నాయని... రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా పచిష్ఠంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  

Govt on Ration Shops: ఏపీలో ప్రజా పంపిణీ పటిష్టంగా ఉందని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు. 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ వల్ల న్యాయం జరుగుతుందని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ...  ప్రపంచంలో కోవిడ్ సంక్షోభం వచ్చింది, కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన అని బియ్యం ఇచ్చేందుకు ఒక పథకం ప్రవేశ పెట్టిందన్నారు. కొవిడ్ వచ్చాక ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2022 వరకు రేషన్‌లో బియ్యం ఇస్తూనే ఉందన్నారు. లబ్ధిదారులు పెరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బియ్యం అందించింద‌ని తెలిపారు. దీనిపై సీఎం ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారని అన్నారు.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచే బియ్యం పంపిణీ..

ప్రజా పంపిణీ ద్వారా బీపీఎల్‌లో తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్న 89 లక్షల మందితో పాటు అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ  ప్రారంభం  అవుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి కేజీ రూపాయి బియ్యం మద్యాహ్నం వరకు డోర్ డెలివరీ ఉంటుంద‌ని వివ‌రించారు. సాయంత్రం 3.30  నుంచి  డిపోల దగ్గర ఉచితంగా బియ్యం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ నుంచి ఇచ్చే బియ్యం... సారైక్స్ బియ్యం ఇస్తున్నామ‌ని, ఉచితంగా ఇచ్చే బియ్యం మాత్రం నాన్ సారైక్స్ బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

విద్యా , వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 

విద్యా,  వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం జగన్ తెలిపారని.. పోటీ తత్వంతో విద్య ఉండాలన్నదే జ‌గ‌న్ ఉద్దేశ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలతో తాను ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాన‌ని బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అమలు చేస్తూ..  వారి ఉద్యోగాలకు ఇబ్బంది  అయితే పోరాటాలు చెయ్యాలని, లేదంటే చ‌ర్చలు జ‌ర‌పాల‌ని అన్నారు. పేద పిల్లలకి కూడా ఫౌండేషన్ నుంచి విద్య ఉండాలనేదే ప్రధాన సంకల్పం అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

కోటి 46 లక్షల బియ్యం కార్డులు..

విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశ  పెడుతున్నామ‌ని, ఇది నిరంత‌రం జ‌రిగే ప్రక్రియ అని అన్నారు. మంత్రి వ‌ర్గ ఉప సంఘం నిర్వహించిన స‌మీక్ష అనంత‌రం  మంత్రులు బొత్స, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర‌ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయని, వచ్చే నెల 1  నుంచి బియ్యం రేషన్ ద్వారా ఇస్తామని అన్నారు. 1 కోటి 46  లక్షల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందుతాయని, రేషన్ షాప్స్ మూసి వేసే ప్రసక్తి లేదని క్లారిటి ఇచ్చారు. కొత్తగా ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామ‌ని వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Breaking News: ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
Chandrababu Naidu CID Case Quashed: అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Embed widget