అన్వేషించండి

Govt on Ration Shops: రేషన్ దుకాణాలు మూసివేయడం లేదంటూ మంత్రివర్గ ఉపసంఘం క్లారిటీ!

Govt on Ration Shops: ఏపీలో మొత్తం 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందుతున్నాయని... రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా పచిష్ఠంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  

Govt on Ration Shops: ఏపీలో ప్రజా పంపిణీ పటిష్టంగా ఉందని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు. 4 కోట్ల 23 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ వల్ల న్యాయం జరుగుతుందని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ...  ప్రపంచంలో కోవిడ్ సంక్షోభం వచ్చింది, కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన అని బియ్యం ఇచ్చేందుకు ఒక పథకం ప్రవేశ పెట్టిందన్నారు. కొవిడ్ వచ్చాక ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2022 వరకు రేషన్‌లో బియ్యం ఇస్తూనే ఉందన్నారు. లబ్ధిదారులు పెరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బియ్యం అందించింద‌ని తెలిపారు. దీనిపై సీఎం ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారని అన్నారు.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచే బియ్యం పంపిణీ..

ప్రజా పంపిణీ ద్వారా బీపీఎల్‌లో తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్న 89 లక్షల మందితో పాటు అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ  ప్రారంభం  అవుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి కేజీ రూపాయి బియ్యం మద్యాహ్నం వరకు డోర్ డెలివరీ ఉంటుంద‌ని వివ‌రించారు. సాయంత్రం 3.30  నుంచి  డిపోల దగ్గర ఉచితంగా బియ్యం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ నుంచి ఇచ్చే బియ్యం... సారైక్స్ బియ్యం ఇస్తున్నామ‌ని, ఉచితంగా ఇచ్చే బియ్యం మాత్రం నాన్ సారైక్స్ బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

విద్యా , వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. 

విద్యా,  వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం జగన్ తెలిపారని.. పోటీ తత్వంతో విద్య ఉండాలన్నదే జ‌గ‌న్ ఉద్దేశ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలతో తాను ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాన‌ని బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అమలు చేస్తూ..  వారి ఉద్యోగాలకు ఇబ్బంది  అయితే పోరాటాలు చెయ్యాలని, లేదంటే చ‌ర్చలు జ‌ర‌పాల‌ని అన్నారు. పేద పిల్లలకి కూడా ఫౌండేషన్ నుంచి విద్య ఉండాలనేదే ప్రధాన సంకల్పం అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

కోటి 46 లక్షల బియ్యం కార్డులు..

విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశ  పెడుతున్నామ‌ని, ఇది నిరంత‌రం జ‌రిగే ప్రక్రియ అని అన్నారు. మంత్రి వ‌ర్గ ఉప సంఘం నిర్వహించిన స‌మీక్ష అనంత‌రం  మంత్రులు బొత్స, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర‌ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయని, వచ్చే నెల 1  నుంచి బియ్యం రేషన్ ద్వారా ఇస్తామని అన్నారు. 1 కోటి 46  లక్షల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందుతాయని, రేషన్ షాప్స్ మూసి వేసే ప్రసక్తి లేదని క్లారిటి ఇచ్చారు. కొత్తగా ఏడు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామ‌ని వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Chandra Babu Naidu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!
Breaking News: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు 
ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కేసులో ఈడీ దూకుడు- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు 
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget