అన్వేషించండి

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు, సొంత అన్నను కోల్పోయినట్లు ఉంది : మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మంత్రి మేకపాటి మరణ వార్తతో వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. గౌతమ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని మంత్రులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) గుండెపోటుతో మరణించారు. ఆయన అకాల మరణంతో ఏపీ(AP)లో విషాదం నెలకొంది. మంత్రులు, వైసీపీ శ్రేణులు మేకపాటికి నివాళులు అర్పిస్తున్నారు. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) అన్నారు. ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేశారని, ఎక్కడా వివాదాలు లేవన్నారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వ్యక్తి అన్నారు. 

'నెల్లూరు జిల్లాలోని సమస్యలపై కొద్దీ రోజుల క్రితమే డిస్కస్ చేశాం. ఆయన మరణం పార్టీకి, మా జిల్లాకి తీరని లోటు. రేపు నెల్లూరులో  పార్టీ నాయకులు చివరి చూపు చూడటానికి అక్కడ పార్థివ దేహాన్ని ఉంచుతాం. మేమిద్దరం ఫిట్ గా ఉంటామని అనేవారు. 

వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు 

వైఎస్ఆర్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వారు మేకపాటి గౌతమ్ రెడ్డి అని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులన్నారు. ఈ రోజు ఆయన ఇకలేరనే విషయం నమ్మశక్యంగా లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మాట అంటే ఆయనకి శిరో దార్యం అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి లేరు అనే వార్త నమ్మలేక పోతున్నామని సజ్జల అన్నారు. ఎల్లుండి ఉదయం మేకపాటి స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 

ఇక్కడే చివరి మజిలీ

నెల్లూరు అంటే మంత్రి మేకపాటికి అమితమైన ఇష్టం. నెల్లూరు(Nellore) వస్తే కచ్చితంగా నగరంలోని తన కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు. అక్కడే అందరినీ కలుస్తారు, మేకపాటి కార్యాలయంలో ఆయనకి అత్యంత ఇష్టమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashakar Reddy) ధ్యానముద్రలో ఉన్న ఫొటో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫొటో కిందే మంత్రి మేకపాటి ఫొటోని కూడా ఉంచి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు నేతలు. హైదరాబాద్(Hyderabad) నుంచి పార్థివ దేహాన్ని తీసుకొచ్చి మంత్రి మేకపాటి కార్యాలయంలోనే ప్రజల సందర్శనార్థం ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీస్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. మంత్రి కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చదును చేయిస్తున్నారు. ఇక్కడే మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గం మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణ పల్లికి తరలిస్తారు. 

Also Read: మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం జగన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget