అన్వేషించండి

Yuvagalam : విభిన్న వర్గాలకు భరోసా - లోకేష్ యువగళంకు భారీ స్పందన !

Nara Lokesh : లోకేష్ యువగళంకు భారీ స్పందన కనిపిస్తోంది. వివిధ వర్గాలతో సమావేశమై భరోసా ఇస్తున్నారు.


Yuvagalam : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర   కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది.  మ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకుంటున్నారు. అంతేకాదు రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేశ్‌కి జనం అభివాదం చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను స్వయంగా నారా లోకేశ్ అడిగి తెలుసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతున్నామని లోకేశ్ వద్ద మహిళలు వాపోయారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెను భారం మోపిందని లోకేశ్ ఆరోపించారు. పెరిగిన ఖర్చులతో సామాన్యుడు బతకడం కష్టంగా మారిందని లోకేశ్ తెలిపారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
  
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసి కులాలు, కులవృత్తులను నిర్లక్ష్యం చేయడమేగాక తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కులానికొక కుర్చీలేని కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని ద్రోహం చేశాడు అని ఆరోపించారు. అమలాపురం హైస్కూలు సెంటర్‌లో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గ జనాభా 30నుంచి 40వేల వరకు ఉన్నారని తమ సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ కార్పొరేషన్ కు రూ. వెయ్యికోట్లు కేటాయించాలని  కోరారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన శెట్టిబలిజలకు నిధులు కేటాయిస్తాం. రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. అమలాపురంలో శెట్టిబలిజ కళ్యాణ మండపానికి స్థలం, నిధులు కేటాయిస్తామని   నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో విభిన్న ప్రతిభావంతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. అమలాపురం ముమ్మడి వరం గేటు వద్ద విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధులు యువనేత నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్‌ను రూ.3వేలు నుంచి రూ.5వేలకు పెంచాలని కోరారు. పుట్టుకతో రెండు కాళ్లు పనిచేయని వారికి పర్సంటేజ్‌తో సంబంధం లేకుండా రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలని కోరారు.  వివాహంతో సంబంధం లేకుండా 35ఏళ్లు దాటిన వికలాంగులకు ఏఏవై రేషన్ కార్డు ఇవ్వడం.. ప్రతియేటా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. వికలాంగుల రిజర్వేషన్ ను 5శాతానికి పెంచాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. చదువుతో సంబంధం లేకుండా మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించాలని   విభిన్న ప్రతిభావంతులు కోరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ వారితో పలు అంశాలపై చర్చించారు. వైసీపీ హయాంలో పర్సంటేజీల పేరుతో పెన్షన్లు కూడా తొలగించారు అని ఆరోపించారు. దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు నిలిపేసి ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు కూడా అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరమని లోకేశ్ ఎద్దేవా చేశారు సొంతిళ్లు లేని దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్లు చేయడంతోపాటు వివాహ ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తామన్నారు. మానసిక విభిన్నప్రతిభావంతులకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులకు ఆసక్తి ఉన్నరంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

వైఎస్ జగన్‌ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో ఈ రోజు యాత్ర కొనసాగనుంది. ఇటీవల వైసీపీకు రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆక్వారైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వారైతులు, తమ ఆవేదనను లోకేశ్‌తో చెప్పుకొని వినతిపత్రం అందజేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
How to Escape from Locked Car: ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
Embed widget