అన్వేషించండి

Nara Lokesh: 'టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ' - శంఖారావం సభలో నారా లోకేశ్ కీలక హామీ

TDP Shankaravam: ఎన్నికల ముందు ప్రభుత్వం హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో శంఖారావం యాత్ర చేపట్టారు.

Nara Lokesh Speech in Shankaravam in Ichapuram: రానున్న ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) 'శంఖారావం' పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని.. ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవో ఇక్కడి ప్రజలూ అంతేనని అన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న పుట్టిన గడ్డ నుంచి 'శంఖారావం' యాత్ర ప్రారంభిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రను టీడీపీ హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడిగా 6,500 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు. అది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని మోసం, దగా, కుట్రకి ప్యాంటు, షర్ట్ వేస్తే జగన్ లా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. '2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయంటూ.. స్కూల్ రేషనైలేజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు. ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా 1.70 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.' అని లోకేశ్ స్పష్టం చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు సహా తనపై, ఇతర నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదని లోకేశ్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరి పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై న్యాయ విచారణ జరిపించి.. వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. 'సీఎం జగన్ సభలు చూస్తుంటే నవ్వొస్తోంది. ఆయన సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లేందుకేనా?. సీఎం తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించడం లేదు. తమకు భద్రత లేదని షర్మిల, సునీత అంటున్నారు. సొంత చెల్లెళ్లకే భద్రత ఇవ్వకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి.?. దేశంలో వంద సంక్షేమ పథకాలకు కోతపెట్టిన ఏకైక సీఎం జగన్. ఆయన ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కొబ్బరి, జీడి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదనే విశాఖలో తహసీల్దార్ రమణయ్యను కొట్టి చంపారు.' అని లోకేశ్ మండిపడ్డారు. అటు, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. లోకేశ్ 'యువగళం' పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ అన్నారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కోరారు.

Also Read: TSRTC News: TSRTC గుడ్ న్యూస్ - బస్ టికెట్ తో పాటే శ్రీశైలం దర్శన టికెట్ బుకింగ్ సదుపాయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget