అన్వేషించండి

Nara Lokesh: 'టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీ' - శంఖారావం సభలో నారా లోకేశ్ కీలక హామీ

TDP Shankaravam: ఎన్నికల ముందు ప్రభుత్వం హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో శంఖారావం యాత్ర చేపట్టారు.

Nara Lokesh Speech in Shankaravam in Ichapuram: రానున్న ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) 'శంఖారావం' పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని.. ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవో ఇక్కడి ప్రజలూ అంతేనని అన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, గౌతు లచ్చన్న పుట్టిన గడ్డ నుంచి 'శంఖారావం' యాత్ర ప్రారంభిస్తుండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రను టీడీపీ హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడిగా 6,500 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు. అది మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని మోసం, దగా, కుట్రకి ప్యాంటు, షర్ట్ వేస్తే జగన్ లా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. '2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయంటూ.. స్కూల్ రేషనైలేజేషన్ పేరుతో పోస్టులు తగ్గించారు. ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా 1.70 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.' అని లోకేశ్ స్పష్టం చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు సహా తనపై, ఇతర నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదని లోకేశ్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులందరి పేర్లు తన రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై న్యాయ విచారణ జరిపించి.. వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. 'సీఎం జగన్ సభలు చూస్తుంటే నవ్వొస్తోంది. ఆయన సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? జైలుకు వెళ్లేందుకేనా?. సీఎం తన కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించడం లేదు. తమకు భద్రత లేదని షర్మిల, సునీత అంటున్నారు. సొంత చెల్లెళ్లకే భద్రత ఇవ్వకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి.?. దేశంలో వంద సంక్షేమ పథకాలకు కోతపెట్టిన ఏకైక సీఎం జగన్. ఆయన ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కొబ్బరి, జీడి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదనే విశాఖలో తహసీల్దార్ రమణయ్యను కొట్టి చంపారు.' అని లోకేశ్ మండిపడ్డారు. అటు, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా.. లోకేశ్ 'యువగళం' పాదయాత్రను ఆపకుండా కొనసాగించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ అన్నారు. కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసని చెప్పారు. ఢిల్లీలో మన గళం వినిపించాలంటే లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని కోరారు.

Also Read: TSRTC News: TSRTC గుడ్ న్యూస్ - బస్ టికెట్ తో పాటే శ్రీశైలం దర్శన టికెట్ బుకింగ్ సదుపాయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attack on Deputy Speaker Raghurama: అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
అకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి - ఆలయంలో పూజల వివాదమే కారణం
Andhra KGF: ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో KGF - దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి - తవ్వకాలకు సిద్ధం
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్

వీడియోలు

White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Navratri Fasting : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Embed widget