అన్వేషించండి

Renew: అనంతపురం జిల్లాకు మెగా హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు - రూ.22000 కోట్ల పెట్టుబడి - ఘనంగా భూమిపూజ

Nara Lokesh: అనంతపురం జిల్లాలో భారీ ప్రాజెక్టుకు నారా లోకేష్ భూమిపూజ చేశారు. అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో దాదాపు రూ.22000 కోట్ల పెట్టుబడి పెడుతోంది రెన్యూ కంపెనీ.

Anantapur News:  ప్రముఖ డీకార్బనైజేషన్ సొల్యూషన్స్ కంపెనీ అయిన ReNew ఎనర్జీ గ్లోబల్ పిఎల్‌సి   ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.22,000 కోట్లు  పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 1.8 GWp సోలార్ పవర్ మరియు 1 GW విండ్ పవర్ తో దాదాపు 2.8 GW ఉత్పత్తి సామర్థ్యం,  2 GWh బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (BESS)తో, ఇది భారతదేశంలో అతిపెద్ద RE కాంప్లెక్స్‌ లలో ఒకటిగా మారబోతోంది. 

 మంత్రి నారా లోకేష్ గారు ,  రిన్యూ  ఛైర్మన్  సుమంత్ సిన్హా   సమక్షంలో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో, ReNew 587 MWp సౌరశక్తి , 250 MWh పవనశక్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు 415 MWh BESS కూడా ఏర్పాటు చేస్తున్నారు.   పెద్ద BESS ఏర్పాటు చేయడం ద్వారా  పునరుత్పాదక శక్తిని మరింత దృఢంగా  పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా మిషన్‌ స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు.  రాజస్థాన్‌లోని జైపూర్, గుజరాత్‌లోని ధోలేరాలోని ReNew   సౌర తయారీ యూనిట్ల నుండి  మేడ్-ఇన్-ఇండియా సోలార్ ప్యానెల్‌లతో రూపొందించారు.  ఉత్పత్తిని పెంచడానికి అత్యాధునిక సోలార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మరోవైపు సోలార్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం భారీ స్థాయిలో నీరు అవసరపడుతుంది. అందుకే నీటిని ఆదా చేసేందుకు నీటి రహిత రోబోటిక్ క్లీనింగ్‌ను ఉపయోగిస్తున్నారు. 

 ఆంధ్రప్రదేశ్   క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు.   2030 నాటికి భారతదేశం   500 GW నాన్-ఫాసిల్ ఇంధన లక్ష్యానికి దోహదం చేస్తుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించాలని మేం పెట్టుకున్న లక్ష్యం ఆధారంగా కార్యరూపం దాల్చిన ప్రాజెక్ట్ ఇది అని నారా లోకేష్ అన్నారు.  ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు  రెన్యూనూ అభినందించారు.  ఇది పీక్ అవర్స్ లో గ్రిడ్ సామర్థ్యాన్ని  పెంచడమే కాకుండా, క్లీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను నేషనల్ లీడర్ గా నిలబెట్టిందని పేర్కొన్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ముందుకు వెళ్తోందని  రిన్యూ చైర్మన్  ఛైర్మన్  సుమంత్ సిన్హా అన్నారు.  అద్భుతమైన ట్రాన్స్‌ మిషన్ కనెక్టివిటీ, సౌర ,  పవన వనరులను సమృద్ధిగా కలిగి ఉందని సిన్హా సంతృప్తి వెలిబుచ్చారు.   2030 నాటికి 500 GW నాన్-ఫాసిల్ ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని 10 సైట్‌లలో  రిన్యూ 717 MW ఆపరేషనల్ విండ్ కెపాసిటీ మ, 60 MW సోలార్ కెపాసిటీ   పోర్ట్‌ ఫోలియోను కలిగి ఉంది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ తో, ఇది 78.5 GW సౌర, 35 GW పవన విద్యుత్ సామర్థ్యం ,  25 GWh బ్యాటరీ శక్తి నిల్వను ఉత్పత్తి చేయాలనే రాష్ట్ర లక్ష్యానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget