అన్వేషించండి

Nakka Anand Babu: నట్టేట ముంచడమే జగన్ నైజం, వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ విషయం బాగా తెలుసు: నక్కా ఆనంద్ బాబు

Nakka Anand Babu: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ను సీఎం చేసినందుకు ప్రజలంతా సిగ్గుపడుతున్నారని అన్నారు.

Nakka Anand Babu: ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభించిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడిన మాటలు వింటూ దెయ్యాలు కూడా సిగ్గుపడతాయన్నారు. సభలో జగన్ చెప్పిన మాటలను విన్న జనమంతా పగలబడి నవ్వుకున్నారని నక్కా ఆనంద్ బాబు సెటైర్లు వేశారు. 

సీఎం మాటలకు జనం నవ్వుకుంటున్నారు! 
సీఎం జగన్ చిలకలూరి పేట సభలో ప్రసంగించిన తర్వాత టీడీపీ పార్టీ కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై విమర్శలు చేశారు. పొత్తులు, జిత్తులు, ఎత్తులు, కుయుక్తులు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు రాష్ట్ర జనం నవ్వుకుంటున్నారని ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గొడ్డలి వేటు కుయుక్తులు, గుండె పోటు ఎత్తులు జగన్ మోహన్ రెడ్డికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదని నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. 

'జగన్ అలా అనడం హాస్యాస్పదంగా ఉంది' 
కోడి కత్తి వ్యవహారం జిత్తుల మారి వ్యవహారం కాదా అని ఆనంద్ బాబు నిలదీశారు. తండ్రి అధికారంలోనే లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి అర్ధబలం, అంగబలం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పరదా లేకుండా ఎక్కడికి ప్రయాణించరని, అలాంటి వ్యక్తి ప్రజలతోనే పొత్తు అంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఆనంద్ బాబు అన్నారు. 

'తల్లితో, చెల్లితో పొత్తులేని వ్యక్తి జగన్' 
తల్లితో, చెల్లెలితో, బాబాయి కూతురితో కూడా పొత్తులేని జగన్ మోహన్ రెడ్డి.. మానవ సంబంధాలు అంటూ వేదాలు వల్లించడం ఏంటని ప్రశ్నించారు. సొంత మీడియాతో పాటు అర్థబలంతో అంగబలంతో మరిన్ని మీడియాలను గుప్పెట్లో పెట్టుకున్న జగన్.. తమకు మీడియా సహకారం లేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మిన వారిని నట్టేట ముంచడమే జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపమని, ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకూ బాగా తెలుసని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. 

'జగన్ ను గద్దె దించేందుకు జనాలు సిద్ధం'

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా.. పచ్చగా చెట్లతో ఉండే ఆ ప్రాంతాల్లో ఒక్క చెట్టు కూడా కనిపించకుండా నరికివేస్తున్నట్లు నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మీడియా సపోర్డ్ లేదని పదే పదే జగన్ చెబుతున్నారని.. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఎవరివంటూ నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. సొంత న్యూస్ పేపర్, సొంత న్యూస్ ఛానల్ ఉన్న మొట్ట మొదటి ప్రాంతీయ పార్టీ వైసీపీనే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహార శైలి, పాలన వైఫల్యాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget