అన్వేషించండి

Raghu Rama Krishnamraju: 'ఆంధ్రాలో అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించింది' - వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న ఎంపీ రఘురామ

Andhra News: వైసీపీ ప్రభుత్వం తనను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అరాచకం సృష్టించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. సోమవారం తుళ్లూరులో రాజధాని రైతులను ఆయన కలిశారు.

Mp Raghurama Krishnam Raju Meet Amaravathi Farmers: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి విజయం ఖాయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు. తొలుత టీడీపీ - జనసేనకు 130 సీట్లు వస్తాయని అంచనా వేశానని.. అయితే బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవడంతో 135 సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని జోస్యం చెప్పారు. సోమవారం ఆయన తుళ్లూరులోని (Tulluru) దీక్షా శిబిరానికి వెళ్లి రాజధాని రైతులు, మహిళలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని అన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల వల్లే రాష్ట్రంలోకి రాలేకపోయినట్లు వెల్లడించారు. తనను ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. కేసులపై కోర్టుల్లో స్టేలు తెచ్చుకునేందుకు 2, 3 నెలల సమయం పట్టిందని.. అందుకే అమరావతి రాజధాని రైతులను ఇదివరకే కలవాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇక్కడికి రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ఐదేళ్లు ఆలస్యమైనా అమరావతిని అనుకున్న దాని కంటే అద్భుత నగరంగా తీర్చిదిద్దగలుగుతారని ఎంపీ రఘురామ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతానని స్పష్టం చేశారు. వైసీపీ 'సిద్ధం' సభకు మీడియాను రావొద్దని చెప్పడంతోనే అవి గ్రాఫిక్స్ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని.. ఇక అందరూ స్వేచ్ఛగా ఎవరి భావాలు వారు వ్యక్తం చెయ్యొచ్చని చెప్పారు. అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సుదీర్ఘ కాలం సాగిన పోరాటం అని.. త్వరలోనే రాజధాని రైతుల పోరాటం ఫలిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల విషయంపై ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్‌ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే. 

Also Read: Botsa Satyanarayana: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలున్నాయా? 3 పార్టీల పొత్తులపై మంత్రి బొత్స సెటైర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget