అన్వేషించండి

Raghu Rama Krishnamraju: 'ఆంధ్రాలో అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించింది' - వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న ఎంపీ రఘురామ

Andhra News: వైసీపీ ప్రభుత్వం తనను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అరాచకం సృష్టించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. సోమవారం తుళ్లూరులో రాజధాని రైతులను ఆయన కలిశారు.

Mp Raghurama Krishnam Raju Meet Amaravathi Farmers: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి విజయం ఖాయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు. తొలుత టీడీపీ - జనసేనకు 130 సీట్లు వస్తాయని అంచనా వేశానని.. అయితే బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవడంతో 135 సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని జోస్యం చెప్పారు. సోమవారం ఆయన తుళ్లూరులోని (Tulluru) దీక్షా శిబిరానికి వెళ్లి రాజధాని రైతులు, మహిళలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని అన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల వల్లే రాష్ట్రంలోకి రాలేకపోయినట్లు వెల్లడించారు. తనను ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. కేసులపై కోర్టుల్లో స్టేలు తెచ్చుకునేందుకు 2, 3 నెలల సమయం పట్టిందని.. అందుకే అమరావతి రాజధాని రైతులను ఇదివరకే కలవాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇక్కడికి రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ఐదేళ్లు ఆలస్యమైనా అమరావతిని అనుకున్న దాని కంటే అద్భుత నగరంగా తీర్చిదిద్దగలుగుతారని ఎంపీ రఘురామ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతానని స్పష్టం చేశారు. వైసీపీ 'సిద్ధం' సభకు మీడియాను రావొద్దని చెప్పడంతోనే అవి గ్రాఫిక్స్ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని.. ఇక అందరూ స్వేచ్ఛగా ఎవరి భావాలు వారు వ్యక్తం చెయ్యొచ్చని చెప్పారు. అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సుదీర్ఘ కాలం సాగిన పోరాటం అని.. త్వరలోనే రాజధాని రైతుల పోరాటం ఫలిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల విషయంపై ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్‌ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే. 

Also Read: Botsa Satyanarayana: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలున్నాయా? 3 పార్టీల పొత్తులపై మంత్రి బొత్స సెటైర్లు

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget