అన్వేషించండి

Raghu Rama Krishnamraju: 'ఆంధ్రాలో అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించింది' - వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్న ఎంపీ రఘురామ

Andhra News: వైసీపీ ప్రభుత్వం తనను ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అరాచకం సృష్టించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. సోమవారం తుళ్లూరులో రాజధాని రైతులను ఆయన కలిశారు.

Mp Raghurama Krishnam Raju Meet Amaravathi Farmers: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి విజయం ఖాయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు. తొలుత టీడీపీ - జనసేనకు 130 సీట్లు వస్తాయని అంచనా వేశానని.. అయితే బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవడంతో 135 సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని జోస్యం చెప్పారు. సోమవారం ఆయన తుళ్లూరులోని (Tulluru) దీక్షా శిబిరానికి వెళ్లి రాజధాని రైతులు, మహిళలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని అన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల వల్లే రాష్ట్రంలోకి రాలేకపోయినట్లు వెల్లడించారు. తనను ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. కేసులపై కోర్టుల్లో స్టేలు తెచ్చుకునేందుకు 2, 3 నెలల సమయం పట్టిందని.. అందుకే అమరావతి రాజధాని రైతులను ఇదివరకే కలవాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇక్కడికి రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ఐదేళ్లు ఆలస్యమైనా అమరావతిని అనుకున్న దాని కంటే అద్భుత నగరంగా తీర్చిదిద్దగలుగుతారని ఎంపీ రఘురామ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతానని స్పష్టం చేశారు. వైసీపీ 'సిద్ధం' సభకు మీడియాను రావొద్దని చెప్పడంతోనే అవి గ్రాఫిక్స్ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని.. ఇక అందరూ స్వేచ్ఛగా ఎవరి భావాలు వారు వ్యక్తం చెయ్యొచ్చని చెప్పారు. అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సుదీర్ఘ కాలం సాగిన పోరాటం అని.. త్వరలోనే రాజధాని రైతుల పోరాటం ఫలిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల విషయంపై ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్‌ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే. 

Also Read: Botsa Satyanarayana: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలున్నాయా? 3 పార్టీల పొత్తులపై మంత్రి బొత్స సెటైర్లు

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget