News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MP Margani Bharat: పార్టీ తరువాతే ఏదైనా, 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్ దిశానిర్దేశం: ఎంపీ భరత్

MP Margani Bharat: రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.  

FOLLOW US: 
Share:

MP Margani Bharat: రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం జగన్ నిర్వహించిన సమావేశ వివరాలను ఎంపీ భరత్ స్థానిక మీడియాకు పత్రికా ప్రకటన ద్వారా బుధవారం తెలియజేశారు. ఎవరైతే ప్రజాభిమానం చూరగొన్నారో వారికే టికెట్ అని స్పష్టంగా సీఎం ప్రకటించారని చెప్పుకొచ్చారు. అలాగని టికెట్ రానివారిని తక్కువ చేసినట్టు కాదన్నారని చెప్పారు. పార్టీ ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని‌ సీఎం జగన్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. పార్టీ శ్రేణులంతా ఈ ఆరు నెలలూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారని‌ ఎంపీ తెలిపారు.

‌పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం సూచించారని చెప్పారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయని ఎంపీ భరత్ పేర్కొన్నారు. ‌అయితే తమకు సీఎం అండ.. మేము ప్రజలకు అండగా ఉండాలనే భావనతో ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటామని ఎంపీ భరత్ ఈ సందర్భంగా తెలిపారు. ‌

సీఎం జగన్ కార్యకర్తలకు ఏం చెప్పారంటే..?

అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత మనం గేర్‌ మార్చాల్సిన సమయం కూడా వచ్చిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ కార్యక్రమాలు ఒక ఎత్తు, అసెంబ్లీ ముగిశాక చేసే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు ఇవన్నీ ఇంకొక ఎత్తు అని వైఎస్ఆర్ సీపీ నేతలతో అన్నారు.

‘‘ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, వచ్చే ఆరు నెలలు సరిగా పనిచేయకపోయినా పర్వాలేదు అనే భావన సరికాదు. వచ్చే ఆరునెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు పడాలి. ఇంతకముందు నేను చెప్పాను. 175 కి 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు?   వైనాట్‌ 175. ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, ఇది సాధ్యం. క్షేత్రస్ధాయిలో మనం అంత బలంగా ఉన్నాం కాబట్టే.. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీచేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి.

గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, మీరు ఇచ్చిన లేఖను ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చినప్పుడు వాళ్లలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే మందు చూపు, ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి. అందుకనే ఇంతకు ముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరునెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ, వారితో మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి. 

Published at : 27 Sep 2023 09:27 AM (IST) Tags: AP News MP BHARAT YSRCP Politics Margani bharat on CM MP Margani Bharat Ram Comments

ఇవి కూడా చూడండి

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ -  ఎందుకంటే ?

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

Andhra News: సీఈవోకు చంద్రబాబు లేఖ - ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని వినతి

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?