అన్వేషించండి

Undavalli : ఏపీకి న్యాయం కోసం ఇప్పటికైనా పోరాడాలి - మోదీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా !

ఏపీకి అన్యాయం జరిగిందన్న మోదీ చెప్పారు కాబట్టి న్యాయం కోసం ఆయను ప్రశ్నించాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సూచించారు. లేకపోతే భవిష్యత్‌లో అసలు ఏపీనే ఎవరూ పట్టించుకోరన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం ఏమిటి ? ఎలా సరిదిద్దుతారో కూడా ప్రధాని మోదీ చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన రాజమండ్రిలో ప్రెస్‌మీట్‌ పెట్టి స్పందించారు. విభజన బిల్లును లోపభూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు. రాజధాని లేకుండా బిల్లు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. తలుపులు మూసేసి ప్రజాస్వామ‌్య విరుద్ధంగా విభజన చేశారన్న మోదీ మాటలు కరెక్టేనన్నారు. ఏం జరిగిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందని.. ప్రధాని అన్న మాటలన్నా ఒక్క ఎంపీ కూడా నోటీసు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. విభేధించిన ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ కేసులతో  భయపెడుతోందన్నారు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏపీకి ఇక ముందు ఎవరూ పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

ప్రజలు అడిగినన్నీ సీట్లు ఇచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టారని .. మోదీ అన్న మాట మాటలనే ఆయకు గుర్తు చేసి..  విభజన అంశాలపై ప్రస్తావించాలని.. తమకు ఎందుకు ముంచేశారో అడగాలని జగన్‌ను కోరారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు ఏపీ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని ఉండవల్లి స్పష్టంచేశారు.  రాబోయే రోజుల్లో ఏపీ అంటే అసలు ఎవరూ పట్టించుకోరన్నారు. ఉండవల్లి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. ఫిబ్రవరిలోనే కరెంట్ కోతలు ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయోనని వ్యాఖ్యానించారు. 

ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు విభజన జరిగిన తీరు చెల్లదని సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో పార్లమెంట్ నిబంధనలన్నీ ఉల్లంఘించి... రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారు ఉండవల్లి వాదిస్తున్నారు.  దీనిపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు.  విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని.. రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన లెక్కలే.. ఉండవల్లి పుస్తకంలో ఉన్నాయి. విభజన చట్టం పాస్ అయినప్పుడు రాజ్యసభలో 353 మంది ఉన్నారు. వారిలో 173 మంది సంతకాలు పెట్టలేదని ఉండవల్లి చెబుతున్నారు. ప్రధాని మోదీ ఇప్పుడు విభజన అంశంపై మాట్లాడటంతో  ఉండవల్లి మరోసారి ప్రెస్ మీట్ అన్ని విషయాలను వివరించారు. విభజన బిల్లు పాస్ అవుతున్న సమయంలో ఉండవల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
YS Jagan Mohan Reddy New Strategy: జగన్ తాడేపల్లి వైరాగ్యానికి తెర! రెండేళ్ల ఓటమి తర్వాత రూట్ మార్చిన వైఎస్సార్‌సీపీ అధినేత.. వైజాగ్ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!
జగన్ తాడేపల్లి వైరాగ్యానికి తెర! రెండేళ్ల ఓటమి తర్వాత రూట్ మార్చిన వైఎస్సార్‌సీపీ అధినేత.. వైజాగ్ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదే!
Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kit:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ రీఓపెన్‌కు అంతా సిద్ధం! కొత్త యూనిఫామ్, విద్యార్థి మిత్ర కిట్లు ఎప్పుడిస్తారు?

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు
Mohammed Siraj News: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!
Gold Price 2026: అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
2026 అక్టోబర్ 31 వరకూ బంగారం ధరలు స్థిరంగా ఉంటాయా? పెరుగుతాయా? ఇక్కడ తెలుసుకోండి!
Peddi Collections Day 6: 'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'పెద్ది' కలెక్షన్లు... రోజుకు పది కోట్లు కష్టమేనా? ఆరు రోజుల్లో రామ్ చరణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
స్కూల్ కి మొదటి రోజు వెళ్లేముందు విద్యార్థులు పఠించాల్సిన శ్లోకాలు ఇవి!
స్కూల్ కి మొదటి రోజు వెళ్లేముందు విద్యార్థులు పఠించాల్సిన శ్లోకాలు ఇవి!
Embed widget