అన్వేషించండి

Undavalli : ఏపీకి న్యాయం కోసం ఇప్పటికైనా పోరాడాలి - మోదీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా !

ఏపీకి అన్యాయం జరిగిందన్న మోదీ చెప్పారు కాబట్టి న్యాయం కోసం ఆయను ప్రశ్నించాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సూచించారు. లేకపోతే భవిష్యత్‌లో అసలు ఏపీనే ఎవరూ పట్టించుకోరన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం ఏమిటి ? ఎలా సరిదిద్దుతారో కూడా ప్రధాని మోదీ చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన రాజమండ్రిలో ప్రెస్‌మీట్‌ పెట్టి స్పందించారు. విభజన బిల్లును లోపభూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు. రాజధాని లేకుండా బిల్లు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు. తలుపులు మూసేసి ప్రజాస్వామ‌్య విరుద్ధంగా విభజన చేశారన్న మోదీ మాటలు కరెక్టేనన్నారు. ఏం జరిగిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందని.. ప్రధాని అన్న మాటలన్నా ఒక్క ఎంపీ కూడా నోటీసు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. విభేధించిన ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ కేసులతో  భయపెడుతోందన్నారు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏపీకి ఇక ముందు ఎవరూ పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

ప్రజలు అడిగినన్నీ సీట్లు ఇచ్చి చక్రవర్తిగా కూర్చోబెట్టారని .. మోదీ అన్న మాట మాటలనే ఆయకు గుర్తు చేసి..  విభజన అంశాలపై ప్రస్తావించాలని.. తమకు ఎందుకు ముంచేశారో అడగాలని జగన్‌ను కోరారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు ఏపీ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని ఉండవల్లి స్పష్టంచేశారు.  రాబోయే రోజుల్లో ఏపీ అంటే అసలు ఎవరూ పట్టించుకోరన్నారు. ఉండవల్లి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. ఫిబ్రవరిలోనే కరెంట్ కోతలు ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయోనని వ్యాఖ్యానించారు. 

ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు విభజన జరిగిన తీరు చెల్లదని సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో పార్లమెంట్ నిబంధనలన్నీ ఉల్లంఘించి... రాజ్యాంగ వ్యతిరేకంగా విభజన చట్టాన్ని ఆమోదించారు ఉండవల్లి వాదిస్తున్నారు.  దీనిపై ఆయన ఓ పుస్తకం కూడా రాశారు.  విభజన చట్టం రాజ్యసభలో పాస్ కాలేదని.. రాజ్యసభ సెక్రటేరియట్ ఇచ్చిన లెక్కలే.. ఉండవల్లి పుస్తకంలో ఉన్నాయి. విభజన చట్టం పాస్ అయినప్పుడు రాజ్యసభలో 353 మంది ఉన్నారు. వారిలో 173 మంది సంతకాలు పెట్టలేదని ఉండవల్లి చెబుతున్నారు. ప్రధాని మోదీ ఇప్పుడు విభజన అంశంపై మాట్లాడటంతో  ఉండవల్లి మరోసారి ప్రెస్ మీట్ అన్ని విషయాలను వివరించారు. విభజన బిల్లు పాస్ అవుతున్న సమయంలో ఉండవల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
Embed widget