అన్వేషించండి

న్యాయ రాజధాని కోసం మిలియన్ మార్చ్- కర్నూలులో రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ ర్యాలీ

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ నిర్వహించారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ.. రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జేఏసీ నేతలు ఉద్యమబాట పట్టారు.

కర్నూలు నగరం ఆనాటి కాలంలోనే ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉంది. ఆరోజు అభివృద్ధి పేరిట రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శ్రీ భాగ్ ఒడంబడిక ద్వారా రాయలసీమ వాసులకు తాగునీటి సౌకర్యం నిధులు నియామకాలలో వెసులుబాటు ఉంటుందనుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి సౌకర్యాలు లేకుండా నేటికీ రాయలసీమ ప్రాంతం కరవు కాటకాలతో వెనుకబడి ఉందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు నగరంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసి విధులను నిర్వహించాలని అన్ని రంగాల ప్రముఖులు డిమాండ్ చేశారు. 

అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షం వారు వ్యతిరేకించడం మూర్ఖత్వపు చర్యగా రాయలసీమ మేధావులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతవాసులు పోరాటాలకు సిద్ధం కావాలని న్యాయ రాజధాని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తమకు వచ్చే నెల జీతాన్ని ఉద్యమానికి ఇస్తానని కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. 

ఎప్పుడూ త్యాగాలేనా... తిరుగుబాటు లేదా...!

రాయలసీమ ప్రజలు త్యాగాలకు ప్రతీక ఆనాటి నుంచి నేటి వరకు రాయలసీమ వనరులను అందరూ అనుభవిస్తున్నారు కానీ ప్రజలు మాత్రం కరవు కాటకాలు వలసలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సంజీవ్‌ కుమార్‌. ఆస్తులు పెంపొందించేందుకు ఒక రియల్ ఎస్టేట్ రాజధాని నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. అందులో భాగంగా కర్నూలుకు రాజధాని ప్రకటించారని వివరించారు. 

హైకోర్టు సాధన ఉద్యమానికి నేతల జీతాలు...!

ప్రభుత్వం చేపట్టే చర్యలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటన్నారు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ . రాయలసీమ ప్రజల ఓట్లతో గతంలో అధికారాన్ని అనుభవించారని అది మర్చిపోయి ప్రవర్తించడం రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పకుండా భవిష్యత్తులో టిడిపి, జనసేన, బీజేపీకి రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని శాపనార్థాలు పెట్టారు. న్యాయ రాజధాని ఉద్యమం రాయలసీమ ప్రజల బాధ్యతని... న్యాయవాదులు, మేధావులు, యువకులు ఈ ఉద్యమాన్ని నీరు కార్చకుండా అందరూ కలిసి సాధించుకోవాలని సూచించారు. దీని కోసం తన నెల జీతం రెండు లక్షల 90వేలు ఉద్యమ నిధికి ఇస్తున్నానని ఎంపీ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేక నీళ్ళు నిధులు పంపకాల్లో కూడా వివక్ష చూపుతున్నారని రాయలసీమ ప్రాంతం వాసులకు ముమ్మాటికీ మోసపోతున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతానికి కేంద్ర బిందువు అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి పాలనను కొనసాగించాలని కోరారు.

ఒక రాష్ట్రానికి రాజధానిని కార్య,శాసన, న్యాయ రాజధానులను ఒకే చోట ఉండాలని నిబంధన లేదన్నారు నేతలు. ఆ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే ఉంటుందని తెలిపారు. మూడు రకాలైనటువంటి పరిపాలన విధానాలను ఒకచోటి నుంచే పాలించడం ద్వారా ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది అనే అపోహలు ఉన్నాయన్నారు. 

భవిష్యత్తు కార్యాచరణ ద్వారా ఉద్యమం...!

సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు, రాజకీయ వ్యక్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ ఒక కార్యచరణ రూపొందించుకోవాలని తీర్మానం చేశారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో విడుదల చేస్తామని నేతలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలు మేల్కొని పోరాటాలకు సిద్ధమవ్వాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజధాని ఏర్పాటుకు రాజీనామాలు చేయాలని సూచించారు. 

వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల వారం క్రితం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి 'న్యాయ' గళాన్ని వినిపించారు. రెండు రోజుల కిందట రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించిన జేఏసీ నేతలు కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
Advertisement

వీడియోలు

అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
UP twin marriages: ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు -  భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు - భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
5 Short Heighted Cricketers:ప్రపంచంలోనే అత్యంత పొట్టి క్రికెటర్లు, టాప్ 5 ఆటగాళ్ల జాబితాను చూడండి
ప్రపంచంలోనే అత్యంత పొట్టి క్రికెటర్లు, టాప్ 5 ఆటగాళ్ల జాబితాను చూడండి
Embed widget