అన్వేషించండి

Kodali Nani : పురందేశ్వరి, షర్మిల ఒకటే - వైసీపీ నేత కొడాలి నాని మైండ్ బ్లోయింగ్ విశ్లేషణ

YSRCP : షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కొడాలి నాని విభిన్నంగా స్పందించారు. బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి ఎన్ని టీడీపీ ఓట్లు చీలుస్తారో షర్మిల కూడా అన్నే వైసీపీ ఓట్లు చీలుస్తారని జోస్యం చెప్పారు.

Kodali Nani On  Sharmila :  షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో కొడాలి నాని కొత్తగా ఆలోచించారు. ఆయన ఈ ఇష్యూలోకి పురందేశ్వరిని తీసుకు వచ్చారు.  వైసీపీపై షర్మిల ప్రభావం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేరుని ఆయన తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు. 

పురందేశ్వరి, షర్మిల సేమ్ టు సేమ్ 

పురంధేశ్వరి టీడీపీ ఓట్లు ఎన్ని చీల్చగలదో షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చగలదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి ప్రభావం టీడీపీపై ఎంత ఉంటుందో.. షర్మిల ప్రభావం వైసీపీపై అంతే ఉంటుందన్నారు కొడాలి నాని.”ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి, 175 సీట్లు పోటీ చేస్తే టీడీపీ లాభమా? నష్టమా? ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది? ఎన్టీఆర్ కూతురు బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించనప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూపిస్తారు? దాని వల్ల టీడీపీకి ఎంత డ్యామేజీ ఉంటుందో కాంగ్రెస్ వల్ల, వైఎస్ షర్మిల వల్ల మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది” అని కొడాలి నాని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే.. బీజేపీ నేత పురందేశ్వరిని ఎందుకు ఈ ఇష్యూలోకి తీసుకు వచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.గతంలోనూ కొడాలి నాని పురందేశ్వరిపై విమర్శలు చేసేవారు. 

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఆశయ సాధనం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ (Delhi) ఏఐసీసీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rajhul Gandhi), ఖర్గే సమక్షంలో వైఎస్సార్టీపీని (Ysrtp) కాంగ్రెస్ (Congress) లో విలీనం చేశారు. ఖర్గే ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.' అని షర్మిల పేర్కొన్నారు.
 
 షర్మిలకు ఏ బాధ్యతలు..?

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఆసక్తి నెలకొంది. ఏఐసీసీలో పదవి ఇస్తారా.? లేదా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే, షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన,  మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ, అదే జరిగితే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో, వైసీపీ తరఫున ఆమె పాదయాత్ర చేసి తన అన్న జగన్ కు అండగా నిలిచారు. అనంతరం తెలంగాణలో పార్టీని స్థాపించి ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget