అన్వేషించండి

Kodali Nani: వైసీపీ కార్యకర్తలపై దాడులు - మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని స్పందన ఏంటంటే?

Andhra Pradesh News: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై.. టీడీపీ, కూటమి శ్రేణులు దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani Responds On Attacks On Ysrcp Supporters: రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులు చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. 'టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు అనుకుంటున్నారు. గ్రామాల్లో దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పోరాడుతాం. దీనిపై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపైనా కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తాను. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అని కొడాలి నాని పేర్కొన్నారు.

'విధ్వంసం సృష్టిస్తున్నారు'

ఎన్నికల్లో గెలిచిన కూటమి శ్రేణులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆవేదన వ్యక్తం చేశారు. 'కౌంటింగ్ రోజు నుంచే టీడీపీ, జనసేన శ్రేణులు.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు. పోలీసులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న వారిని కనీసం ఆపేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోనందుకు పోలీసులపై కోర్టుకు వెళ్తాం.' అని పేర్ని నాని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget