అన్వేషించండి

AP Cabinet Decisions: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి - ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

Andhra Pradesh cabinet meeting: ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్ఐపీబీలో తీసుకున్నపెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ గా మార్చనున్నారు.

Key decisions taken in AP cabinet meeting:  ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం  సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.   రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డాటా సెంటర్ తో సహా   రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపింది.   విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ మెగా డేటా సెంటర్, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల డీఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. 

సమావేశం తర్వాత మంత్రి  పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.  సమావేశంలో అతి పెద్ద నిర్ణయం విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేత ఏర్పాటు చేసే హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ఆమోదం. ఈ ప్రాజెక్టుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి పెడతారు.  ఇది భారతదేశంలో అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతుంది. దీని ద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. "వైజాగ్‌ను 'ఏఐ సిటీ'గా తయారు చేయడమే లక్ష్యం" అని ప్రభుత్వం చెబుతోంది.  మరో 26 ప్రాజెక్టులకు మొత్తం రూ.27,304 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చారు. ఇవి ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉంటాయి.             

రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసే అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో గవర్నర్ రాజ్‌భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు కేటాయించారు. అలాగే, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)కు మరో రూ.14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఇందులో 25% (సుమారు రూ.3,706 కోట్లు) మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టులు 1.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతాయి. క్యాపిటల్ ఏరియాలో నాలుగు కొత్త కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇవి గ్రీన్-సర్టిఫైడ్ భవనాలుగా ఉంటాయి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు సీఆర్‌డీఏనే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించారు. ఇది రాజధానిని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో ముఖ్యమైనది.
 
ఉద్యోగులకు డీఏ పెంపు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4% పెంచేందుకు చర్చించారు.  దీపావళి ముందు ఈ ప్రయోజనం అందించాలని నిర్ణయించారు.  'హ్యాపీ నెస్ట్' ,  'ఏపీ ఎన్‌ఆర్‌టీ' ప్రాజెక్టులకు బిల్డింగ్ పర్మిషన్ ఫీజులను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు ఆమోదం. ఇందులో ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలకు ప్రాధాన్యత. హోటల్స్, పర్యాటక రంగంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.  ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం తెలిపింది.                              

            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Charani: శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
శభాష్‌ శ్రీచరణి- వరల్డ్‌కప్ విజేతకు ఏపీలోకి గ్రాండ్ వెల్కమ్‌- భారీ నజరాను ప్రకటించిన ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్‌ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
2026 Hero Xtreme 160R షోరూమ్‌లలోకి ముందే వచ్చేసింది - కొత్త ఫీచర్లు, కొత్త అటిట్యూడ్‌
US Shutdown: ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
Embed widget