అన్వేషించండి

Kapu Movement: ఆ కాపు ఉద్యమ నేతలకు గుడ్‌న్యూస్.. టీడీపీ హయాంలో పెట్టిన కేసులన్నీ జగన్ సర్కార్ విత్ డ్రా

కాపు నేత ముద్రగడ పద్మనాభం తమ సామాజికవర్గ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఉద్యమం చేపట్టారు. ఆయన పిలుపుతో కదిలిన కాపులు రోడ్లపైకి వచ్చి బీభత్సం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమం తునిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో  కేసులను ఎదుర్కొంటున్నవారికి జగన్ సర్కార్ ఊరటనిచ్చింది. కాపులకు రిజర్వేషన్ల ఉద్యమంలో నమోదైన అన్ని కేసులను వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ సర్కార్ పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నమోదయిన కాపు ఉద్యమ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది.
 
2016 - 2019 మధ్య కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో నమోదయిన 176 కేసులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఆ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. కాపు ఉద్యమ సమయంలో తూర్పుగోదావరి జిల్లా  కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్ తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదవగా వాటిలో 153 కేసులను ఇప్పటికే కొట్టివేశారు. మిగిలిన  పెండింగ్ కేసులను కూడా ఉపసంహరిస్తున్నట్టు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

2016 జనవరిలో తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణం సమీపంలో  కాపునేతల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమ సమయంలో విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు విచారణలో ఉండగానే ఉపసంహరించుకుంటున్నట్లు 2020లో జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం వ్యవహారంలోనే మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. వీటిలో 51 కేసులను 2019 లోనే వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మిగతా  కేసులను 2020లో ఉపసంహరించుకుంది. తాజాగా మరికొన్ని కేసులను వెనక్కి తీసుకోవడంతో చాలామంది కాపు నాయకులకు ఊరట లభించినట్లయింది.

టీడీపీ హయాంలో భారీ ఉద్యమం
కాపు నేత ముద్రగడ పద్మనాభం తమ సామాజికవర్గ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఉద్యమం చేపట్టారు. ఆయన పిలుపుతో కదిలిన కాపులు రోడ్లపైకి వచ్చి తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది ఉద్రిక్తతంగా మారి హింసకు దారి తీసింది. చాలామంది నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇలా టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు నేతలపై నమోదయిన కేసులను వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది.

అయితే, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందినవారే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు. కొంత మందితో కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఇటీవల ఓ బహిరంగ లేఖలో ముద్రగడ చెప్పారు. దానికి తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగానే ఆయన ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్‌
Embed widget