By: ABP Desam | Updated at : 17 Jan 2022 04:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. తాజాగా కడప రిమ్స్ వైద్యకళాశాలలో కరోనా కలకలం రేగింది. రిమ్స్ వైద్య కళాశాలలో చదువుతున్న 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఎన్టీఆర్ వర్శిటీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ పరీక్షలు జరగనున్నాయి. రేపు 150 మంది వైద్య విద్యార్థులు కళాశాలలో పరీక్షలు రాయనున్నారు. వీరికి తాజాగా పరీక్షలు నిర్వహించగా... వీరిలో 50 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మరికొందరి నివేదికలు రావాల్సిఉంది. ఈ తరుణంలో రేపు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ వర్శిటీని కోరింది. ఫైనల్ పరీక్షలు జరిగే సమయంలో కోవిడ్ కలకలం రేగడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పరీక్షలు వాయిదా వేయలేం : ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ
కడప రిమ్స్ విద్యార్థులకు కరోనాపై ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ స్పందించింది. కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ఫోన్లు చేశారని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ రిజిస్ట్రార్ అన్నారు. పరీక్షల వాయిదాపై రాతపూర్వక అభ్యర్థన ఏంరాలేదన్నారు. రేపు వైద్య విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కరోనా సోకినవారికి ప్రత్యేక గదుల్లో పరీక్షల నిర్వహించాలన్నారు. ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్రిన్సిపల్ చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలు కాబట్టి వాయిదా వేయలేమన్నారు.
Also Read: కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
దేశంలో కరోనా కేసులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త శాంతించాయి. నిన్నటితో పోల్చితే 13,113 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. గత రెండు వారాలుగా ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయే, తప్ప తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,58,089 (2 లక్షల 58 వేల 89) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 385 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.
నిన్న ఒక్కరోజులో 1,51,740 (ఒక లక్షా 51 వేల 740) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది. క్రితం రోజు కేసులను పరిశీలిస్తే నేడు మూడు లక్షలు దాటేలా కనిపించాయి. అనూహ్యంగా నిన్నటి కన్నా 13 వేల కేసులు తక్కువగా నిర్దారణ అయ్యాయి.
Also Read: కోడి పెంట తరలింపు పేరుతో దిమ్మతిరిగే దందా.. ‘పుష్ప’ రేంజ్లో మాస్టర్ ప్లాన్లు, పక్క రాష్ట్రం నుంచి..
8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనమోదైన వాటితో కలిపితే దేశంలోని మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8,209కు చేరుకున్నాయి. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న క్రమంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ వైపు ఫోకస్ చేస్తున్నాయి. మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
Also Read: : అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి