అన్వేషించండి

Pawan Kalyan: అయోధ్య రామమందిర ప్రారంభానికి పవన్‌ కళ్యాణ్‌కు ఆహ్వానం

Ayodhya Ram Mandir: ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేతలు ఆహ్వాన పత్రిక అందించారు.

Pawan Kalyan invites for Ayodhya Ram Mandir Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు ఆహ్వానం అందింది. ఈ మేరకు పవన్‌కు ఆర్ఎస్ఎస్ (RSS) ఇవాళ ఆహ్వాన పత్రిక అందజేసింది. బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్,  విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి శ్రీనివాస రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయ ప్రముఖ్  పూర్ణ ప్రజ్ఞ కలిశారు. అయోధ్య రామమందిర ప్రారంభానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. 

రాజకీయ పార్టీల నేతలందరికీ ఆహ్వానాలు 
ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలను పవన్‌కు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దేశంలోని రాజకీయ పార్టీల నేతలందరికీ ఆహ్వానాలు అందిస్తున్నారు. రాజకీయ విబేధాలను పక్కన పెట్టి అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అనేకమంది భారీగా విరాళాలు అందించారు. పవన్ కూడా  ఆలయ నిర్మాణం కోసం రూ.30 లక్షలు విరాళం ఇచ్చారు. గతంలో తిరుపతిలో స్వయంగా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులకు చెక్కును అందించారు. అంతేకాకుండా అందరూ విరాళం అందించాలని పవన్ పిలుపునిచ్చారు. రాముడు అందరి దేవుడని, కులామతాలకు అతీతంగా విరాళాలు ఇవ్వాలని జనసేన నేతలు, కార్యకర్తలు సూచించారు. దీంతో జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.

పవన్ వెళ్తారా? లేదా? 
రామమందిర ప్రారంభోత్సవానికి పవన్‌ను స్వయంగా కలిసి ఆర్ఎస్ఎస్ నేతలు ఆహ్వానించారు. దీంతో పవన్ వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. పవన్ వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్‌కు దైవభక్తి చాలా ఎక్కువ. పూజలు, యాగాలు, దీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే గోవులను పూజిస్తూ ఉంటారు. అన్ని మతాలను పవన్ గౌరవిస్తూ ఉంటారు. దీంతో పవన్ అయోధ్యలో రామమందిరం ప్రారంభాని (inauguration of Ayodhya Ram Mandir)కి వెళ్లే అవకాశముంది. ఈ నెల 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది రాముడి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజలందరూ రావాల్సిందిగా ఇప్పటికే ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. అందుకు తగ్గట్లు భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

జనవరి 22న అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ట 
 22వ తేదీన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరాముడిని బాల రాముడి రూపంలో ప్రతిష్టించనున్నారు. కర్ణాటకకు చెందిన యోగిరాజ్ అరుణ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాన్ని ఆ రోజున ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీతో సహా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది అతిథులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వాన కార్డును కూడా అద్బుతంగా తయారుచేయించారు.  ఆలయం నిర్మాణం ఎలా జరిగింది? ఎప్పుడేం జరిగాయి? అనే వివరాలను పొందుపర్చారు. శ్రీరాముడు తన జన్మస్థలంలోని ఆలయానికి తిరిగి వచ్చిన సందర్భంగా శుభప్రదమైన వేడుక అంటూ కార్డు తొలి పేజీలో రాసి ఉంది. ప్రధాని మోదీతో పాటు దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.  సినీ ప్రముఖులను కూడా శ్రీరాం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్ ను ఆహ్వానించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Embed widget