అన్వేషించండి

Anna Canteen: వంద రోజులుగా రూ.2తో పేదల ఆకలి తీర్చిన అన్నగారి భోజనశాల, నేడు మరింత స్పెషల్!

Anna Canteen: హిందూపురంలో మే నెలాఖరులో ప్రారంభించిన అన్నగారి భోజన శాల 100 రోజులు విజయవంతంగా పేదల ఆకలి తీర్చింది. ఈ క్రమంలోనే నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక భోజనాన్ని ఏర్పాటు చేశారు. 

Anna Canteen: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర మే నెలాఖరులో అన్న క్యాంటీన్‌ ను ప్రారంభించారు. అది నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజుల పేట పేద ప్రజలకు రెండు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టింది. హండ్రెడ్ డేస్ ఘనవిజయంగా పూర్తయిన సందర్భంగా నేడు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక భోజనాన్ని పేదలకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బిర్యానీ, చికెన్, గుడ్డు, ఒక స్వీటు పెట్టేలా ఏర్పాట్లు చేశారు. 

చాలా సంతోషంగా ఉంది - వసుంధర 
ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు రూ. 2కే భోజనం అందిస్తున్నారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అమ్మ క్యాంటీన్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వసుంధర అన్నారు. ఎన్టీఆర్ కోడలు అయినందుకు తాను గర్వ పడుతున్నానని తెలిపారు. 

నందమూరి పురంలో మాత్రమే సాధ్యం.. 
‘ఎన్నారై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి బాలకృష్ణ కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రూ. 2కే భోజనం ఇవ్వడం ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకత. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు. హిందూపురంలోనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుందని. మామ గారు ఎన్టీఆర్.. పైనుంచి ఇవన్నీ నడిపిస్తున్నారు’’ అని వసుంధర చెప్పారు. హిందూపురాన్ని వసుంధర నందమూరి పూరం అని చెప్పడం గమనార్హం. 

మరో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు 
మరోవైపు గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్‌ కూడలిలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం, బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. ఈరోజు టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్ ఈ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. మహానాడుకు స్పందన చూసి వైసీపీ నేతలకు వణుకు పుట్టిందన్నారు.

ఇదిలా ఉండగా తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు.. 
ఇటీవల తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అన్న క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేవలం గంట వ్యవధిలో  నిర్వహించే అన్న క్యాంటీన్ తొలగించమనడం సరికాదని, అక్కడే నిర్వహిస్తామని టీడీపీ నేతలు అన్నారు. తెనాలి బస్టాండ్ సమీపంలో అన్న క్యాంటీన్ నిర్వహించవద్దని ఆర్టీసీ అధికారులు టీడీపీ నేతలను కోరారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బలవంతంగా అన్న క్యాంటీన్ తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

నారా లోకేశ్ ఫైర్.. 
అన్న క్యాంటీన్లుపై దాడులు, ప్రభుత్వం వాటిని తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ కు మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు.  తెనాలిలో అన్న క్యాంటీన్‌ కు అడ్డుపడటం చూస్తే మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని, పేద వాళ్ల ఆకలి తీరుస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget