By: ABP Desam | Updated at : 16 Mar 2023 11:34 AM (IST)
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
సీఎం జగన్కు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం (మార్చి 17) ప్రధానిని కలవనున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం నేడు (మార్చి 16) సాయంత్రమే సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నారు. అక్కడి నుంచి 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాత్రి 7.15 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నివాసానికి వెళ్లి అక్కడే బస చేయనున్నారు.
అమిత్ షాతో కూడా భేటీ
సీఎం జగన్ ఎప్పటిలాగే రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీని అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికి జగన్ ఇస్తారని తెలుస్తోంది.
జులైలో విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో జగన్ మంత్రులకు స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
కాసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం జగన్, బడ్డెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత క్యాంపు ఆఫీసులో ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు, అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావడం, విభజన హామీల అమలులో కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం, మరోసారి ఎన్నికలు రానున్న వేళ జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు సీఎం జగన్. అయినా ఆయన కేంద్రం నుంచి ఏమీ రాబట్టుకోలేదని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఏపీ బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లు
ఏపీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబధించిన బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు 22,316గా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు కాగా, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతంగా చూపించారు.
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్