అన్వేషించండి

Chandrababu Release : 52 రోజుల తర్వాత బయటకు - రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల !

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు.


Chandrababu Release :  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఉదయం పదిన్నరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వచ్చింది. వెంటనే షరతుల మేరకు ఏసీబీ కోర్టులో రెండు ష్యూరిటీలను దేవినేని ఉమ, బొండా ఉమ సమర్పించారు. ఆ తర్వాత రిలీజ్ ఆర్డర్ ను ఏసీబీ కోర్టు నుంచి జైలుకు పంపించారు. లాంఛనాలు పూర్తి కావడంతో నాలుగు గంటల సమయంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 

Chandrababu Release : 52 రోజుల తర్వాత బయటకు - రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల !

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కాన్వాయ్ ఉండవల్లి నుంచి రాజమండ్రికి వచ్చింది. ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ మొత్తం  జైలు వద్దకు వచ్చింది. చంద్రబాబు కుటుంబసభ్యులు అందరూ జైలు వద్దకు వచ్చారు. నారా లోకేష్, బాలకృష్ణ కూడా  వచ్చారు. పెద్ద ఎత్తున జనం రావడంతో.. వారిని అదుపు చేసేందుకు కిలోమీటర్ ముందే పోలీసులు బారీకేడ్లను పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలు తోసేసుకుని వెళ్లిపోయారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో యాభై రోజుల పాటు ఎప్పుడూ బయట కనిపించకుండా ఉండలేదు. ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. చంద్రబాబు ర్యాలీచేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి ర్యాలీలు చేయడం లేదని  టీడీపీ స్పష్టం చేసింది. 

Chandrababu Release : 52 రోజుల తర్వాత బయటకు - రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల !

చంద్రబాబు విడుదలవుతున్న సమయంలోనే ఏపీ సీఐడీ అధికారులు హడావుడిగా హైకోర్టులో లంట్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీలు చేయకుండా చూడాలని.. మీడియాతో మాట్లాడవద్దని.. డీఎస్పీలు ఆయనపై నిఘా పెట్టేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన   పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని, రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు నిర్దేశించింది.       

Chandrababu Release : 52 రోజుల తర్వాత బయటకు - రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల !              

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో ఎనిమిదో తేదీలోపు రానుంది.  సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును  బట్టి చంద్రబాబు తదుపరి న్యాయపోరాటం ఉండే అవకాశం ఉంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ  వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెబితే.. ఆయనపై  పెట్టిన కేసలేవీ చెల్లవు. ఆయనకు విదించిన రిమాండ్ కు చట్టవిరుద్ధంగా ప్రకటించినట్లవుతుంది.  ఒక వేళ 17 ఏ వర్తించదనుకుంటే.. ఆయనపై తనపై నమోదైన కేసుల విషయంలో  న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.                                                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget