అన్వేషించండి

Chandrababu Letter to ACB Judge: 'నన్ను అంతమొందించేందుకు కుట్ర' - ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ

Chandrababu letter: జైల్లో తన భద్రతపై అనుమానంగా ఉందంటూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మరోవైపు, ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి వైదొలిగారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా జడ్జికి లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ తన ఆవేదనను లేఖలో పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఈ నెల 25న 3 పేజీల లేఖను న్యాయమూర్తికి రాశారు.

లేఖలోని అంశాలివే

'నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీసి స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. తూ.గో జిల్లా ఎస్పీకి దీనికి సంబంధించిన లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై కూడా పోలీస్ అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.' అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

భద్రతపై ఆందోళన

ఈ సందర్భంగా జైలులో తన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఎస్ కోటకు చెందిన ఓ నిందితుడు జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నా కదలికలపై జైలులో అనధికారికంగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారే డ్రోన్లు ఎగరేస్తున్నారని భావిస్తున్నాను. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబ సభ్యులు వచ్చిన సందర్భంలోనూ సెంట్రల్ జైల్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకూ ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా. నాలుగున్నరేళ్లలో నాపై వివిధ సందర్భాల్లో అధికార పక్షం వారు దాడి చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్ద విసిరేస్తున్నారు.' అంటూ చంద్రబాబు లేఖలో న్యాయమూర్తికి వివరించారు.

ఇక్కడి ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఉన్నారని, కొందరు ఖైదీల వల్ల తనకు తీవ్ర ముప్పు పొంచి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 2019లో తన భద్రతను తగ్గించారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉదాహరణలే ఉన్నాయని వివరించారు.

మరో షాక్

మరోవైపు, స్కిల్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రాగా, 'నాటి బిఫోర్ మీ' అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది.

కాల్ డేటా పిటిషన్ పై 31న తీర్పు

అటు, చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ కాల్ డేటా ఇవ్వాలన్న పిటిషన్ పైనా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై ఈ నెల 31న తీర్పు ఇవ్వనున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. కాగా, చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని చంద్రబాబు తరఫు న్యాయవాది గత విచారణ సందర్భంగా వాదించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget