అన్వేషించండి

FM Radio Stations: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు - ఏయే ప్రాంతాల్లో అంటే?

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 32 నగరాల్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో 68, తెలంగాణలో 31 అందుబాటులోకి రానున్నాయి.

New FM Radio Stations In AP And Telangana: దేశవ్యాప్తంగా 234 కొత్త నగరాల్లో ప్రైవేట్ ఎప్ఎం రేడియో సౌకర్యం కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో మాతృభాషలో స్థానిక కంటెంట్ పెంచేందుకు, అలాగే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఎఫ్ఎం రేడియో సౌకర్యం ఉండగా.. తాజాగా మరిన్ని నగరాల్లో రేడియో స్టేషన్లు విస్తరించనున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఎఫ్ఎం స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 22 పట్టణాలు, తెలంగాణలో 10 నగరాల్లో ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

ఏపీలో ఎక్కడెక్కడంటే.?

ఏపీలో మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు (FM Radio Stations) ఏర్పాటు కానున్నాయి. ఆదోని 3, అనంతపురం 3, భీమవరం 3, చిలకలూరిపేట 3, చీరాల 3, చిత్తూరు 3, కడప 3, ధర్మవరం 3, ఏలూరు 3, గుంతకల్ 3, హిందూపూర్ 3, కాకినాడ 4, కర్నూలు 4, మచిలీపట్నం 3, మదనపల్లె 3, నంద్యాల 3, నరసరావుపేట 3, ఒంగోలు 3, ప్రొద్దుటూరు 3, శ్రీకాకుళం 3, తాడిపత్రి 3, విజయనగరం 3 రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.

అటు, తెలంగాణలోనూ 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఆదిలాబాద్ 3, కరీంనగర్ 3, ఖమ్మం 3, కొత్తగూడెం 3, మంచిర్యాల 3, నల్గొండ 3, మహబూబ్ నగర్ 3, నిజామాబాద్ 4, రామగుండం 3, సూర్యాపేటలో 3 ఎఫ్ఎం స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.

మరిన్ని నిర్ణయాలు

మరోవైపు, ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. రూ.28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏపీలోని ఓర్వకల్లు - కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్‌లో ఇవి ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. 

కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందు కోసం రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ హబ్‌తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం రూ.2,786 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని.. వీటితో రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.

పోలవరానికి నిధులు

అటు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకోనున్నాయి.

Also Read: Telangana: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ - డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేసేలా పనులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget