అన్వేషించండి

Vishnuvardhan Reddy: కాణిపాకం ఆలయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సత్య ప్రమాణం.. ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కడ..?

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సత్య ప్రమాణాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేశారు.

ఏపీలో గత రెండేళ్లుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతల మధ్య సత్య ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సత్య ప్రమాణాలకు వెళుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ఆరోపణలు, పరస్పర విమర్శలు సత్య ప్రమాణం వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో సత్యదేవుడి ముందు ప్రమాణానికి తాను సిద్ధమని విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం (ఆగస్టు 10న) వేదపండితులు, అధికారులు, బీజేపీ శ్రేణుల మధ్య  సత్య ప్రమాణం చేశారు. బాధ్యత గల వ్యక్తిగా 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని చెస్తానని చెప్పిన తాను మాట నిలబెట్టుకున్నానని అన్నారు. ఇప్పటివరకూ తాను ఏ ఆశ్రమము, మఠాల నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని కాణిపాకం ఆలయంలో సత్యదేవుడు ముందు ప్రమాణం చేశారు. తన జీవితంలో ఏ రకమైన అవినీతికి పాల్పడలేదన్నారు. 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని సత్య ప్రమాణం చేశారు. తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు ప్రమాణం చేస్తానని చెప్పిన ఆయన.. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. 

‘వేదపండితులు, అధికారులు, బీజేపీ నేతల సమక్షంలో దేవుడు ఆలయంలో ప్రమాణం చేస్తున్నాను. ఈ సత్య ప్రమాణానికి నేను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఆహ్వానం పలికాను. నిజాయితీపరుడిని కనుక నేను చెప్పినట్లుగానే ఆలయానికి వచ్చి ప్రమాణం చేశా. ఎమ్మెల్యే రాచమల్లు మహిళలకు గౌరవం ఇవ్వడు, వారిని అవమానపరిచి మాట్లాడే తరహా వ్యక్తి. కానీ నేను రాచమల్లు ఇంటి మహిళలకు పసుపు కుంకుమ, చీరలు పంపాను. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పసుపు కుంకుమను నేను ఎన్నడూ వాడుకోలేదు. 

రాచమల్లులాగ దిగజారుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదు. అందుకే కాణిపాకం ఆలయానికి వచ్చాను. ఎమ్మెల్యే రాచమల్లుకు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేకపోవచ్చు. చెప్పిన ప్రకారం నేను ఆలయానికి వచ్చి ప్రమాణం చేశా. కానీ రాచమల్లు మాత్రం ఇక్కడికి రాకుండా పారిపోయాడు. రాచమల్లుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ దేవుడు ఇకనైనా మంచి బుద్ధిని ప్రసాదించాలని’ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సత్య ప్రమాణం నేపథ్యంలో కాణిపాకంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మా నేత విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారు, అయితే అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కడా.. అని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Also Read: MP Raghu Rama: విశాఖలో భూకబ్జాలు...రాష్ట్రంలో రివర్స్ రూలింగ్...ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget