అన్వేషించండి

AP BJP : ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !

రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. సీమ ప్రాజెక్టులకు పైసా ఖర్చు పెట్టడం లేదని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

 

AP BJP :రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయితే ప్రభుత్వం వరద సహాయక చర్యలు చేపట్టకపోవడం , వాటిని రైతుల కోసం ఆ నీటినివినియోగం చేయలేకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి  విమర్శలు గుప్పించారు.  బుధవారం తిరుపతిలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాల విషయంలో జగన్ సర్కార్‌‌ కు చిత్తశుద్ధి లేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ గారు సాగునీటి ప్రాజెక్టులపై 3సం.లో ఖర్చు పెట్టింది ₹15393 కోట్లు ఈ విధంగా మీరు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెట్టినట్లయితే రానున్న 25 సంవత్సరాలు కూడా రాష్ట్రం లో ప్రాజెక్టులు పూర్తి కావు. రైతుల కల నెరవేరదు అన్నారు .

రివర్స్ టెండర్లు పేరుతో  కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. హంద్రీనీవా, గాలేరు, నగరి వంటి తోటపల్లి , లాంటి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోగా రైతులకు ద్రోహం చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసిందా అని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 38 నెలల మీ పాలనలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రంపై నెట్టి వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల నుండి తప్పించుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. 

రహదార్ల నిర్మాణాలకు సంబంధించి, జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  జాతీయ , అంతర్జాతీయ నిధులు ఉపయెూగం చేసుకోలేదని , దీని కారణంగా రోడ్లు , రైల్వే , ఇతర ముఖ్యమైన ప్రాజక్టులు వీరి నిర్లక్ష్యం , ఫలితంగా రాష్ట్రం 25 సంవత్సరాల వెనుకకు పోతుందని , ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేక అంతర్జాతీయ స్థాయిలో తక్కువ వడ్డీకి యన్, డి, బీ  బ్యాంకు నిధులు సైతం రెండో దశ ను వదులుకునేది సిద్ధం కావడం దారుణం అన్నారు .

మొదటి దశలో రెండు వేల కోట్లకు టెండర్లను ఈ ప్రభుత్వం పిలిస్తే 18 నెలల కాలంలో 50 కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేశారు అంటే ఈ ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది . ఎన్ డి భి నిధులు వినియోగించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా వెుత్తం చెల్లించాలి .  రాష్ట్రం వాట చెల్లించలేక నేడు  రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఆగిపోయింది ప్రభుత్వం ఈ విషయంలో అని కాదని నిరూపించగలరా అని అయన ప్రశ్నించారు . 52 మంది  ఎమ్మెల్యేల కు 48 మంది ని , 8 ఎంపీలకు ఎనిమిది మంది గెలిపించిన పాపానికిసీమకు ద్రోహం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు.  భవిష్యత్లో  సాగునీటి కోసం బీజేపీ నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన తో కలిసి పని చేస్తుందన్నారు. రాయలసీమ , ఉత్తరాంద్రలో నెలకొన్న సమస్యలపై త్వరలో పెద్దఎత్తున పోరాటం చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Small Saving Schemes: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా?
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Komatireddy Venkat Reddy: నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
నిరుపేద విద్యార్ధినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండ, ఇటలీ విద్యకు ఆర్థిక సాయం
Embed widget