![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Employees Leaders : ఏపీ ఉద్యోగ సంఘ నేతల మధ్య రచ్చ - సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు
ఏపీ ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీఎంను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
![AP Employees Leaders : ఏపీ ఉద్యోగ సంఘ నేతల మధ్య రచ్చ - సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు Bandi Srinivasa Rao demanded that action should be taken against Suryanarayana who had complained to the Governor against the AP government. AP Employees Leaders : ఏపీ ఉద్యోగ సంఘ నేతల మధ్య రచ్చ - సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/9919014683b9000464038956075897af1674129828644228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Employees Leaders : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఉదయం సూర్యనారాయణరావు ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో గవర్నర్ను కలిసి ఏపీ ప్రభుత్వ జీతాలు, బకాయిలు సరిగ్గా చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మండిపడ్డారు. అధికారంతో గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారని నిలదీశారు. చట్ట విరుద్ధంగా సూర్యనారాయణతో పాటు ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎంను కలిసిన ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్ సభ్యులు కలిశారు.ఏపీఎన్జీవో అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్యానల్, కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నూతన అద్యక్షుడు బండి శ్రీనివాసరావు గవర్నర్ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు,పెండింగ్ సమస్య లపై ఫిర్యాదు చేయటాన్ని తప్పు పట్టారు.
సూర్యానారాయణపై చర్యలు తీసుకోవాలన్న బండి శ్రీనివాసరావు
సూర్య నారాయణ కు కావాల్సింది సొంత ప్రయోజనాలేనని, ఉద్యోగుల ప్రయోజనాలు కాదని బండి ఆరోపించారు.అంతే కాదు సూర్య నారాయణ మాటలకు అర్థం పర్థం లేదని ఫైర్ అయ్యారు. టెలిగ్రామ్ లో నెంబర్లు చూపించి వారి సంఘంలో లక్షన్నర మంది సభ్యులు ఉన్నారని సూర్యనారాయణ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 12 పీఆర్సీలు తెచ్చిన సంఘం తమదని అన్నారు. 72 ఏళ్ళ చరిత్ర ఉందని గుర్తు చేశారు. నర్సాపురంలో పోటీ చేసి రెండు ఓట్లు మాత్రమే తెచ్చుకున్న వ్యక్తి అని ఎగతాళి చేశారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసే అధికారం ఉద్యోగ సంఘాలకు లేదన్నారు. ఫిర్యాదు చేయటం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాంటి చర్యలకు పాల్పడిన సూర్య నారాయణ పై చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు.
సూర్యనారాయణ గవర్నర్కు ఏమని ఫిర్యాదు చేశారంటే ?
ప్రతి నెల ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా చట్టం చెయ్యాలని ఏపీ ఉద్యోగ సంఘ ప్రతినిధులు గవర్నర్ విశ్వభూషన్ ను కలిశారు.ఉద్యోగుల DA బకాయిలు, జీపీఎఫ్ బజాయిలు, సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందన్నారు, ఉద్యోగ సంఘ నాయకులు సూర్యనారాయణ..ఉద్యోగులు ఆందోళన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడ ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాలని గవర్నర్ ను కలిశామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు,పెన్షనర్లు,దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామని.. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరామన్నారు.తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోని పక్షంలో ఏప్రిల్ నుంచి తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతున్నామనిన వివరించారు. అయితే ఇది ఏపీఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడికి నచ్చలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)