అన్వేషించండి

Breaking News Live Telugu Updates: క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు 

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతం నుంచి ఏపీ తీరం వైపు బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో నేడు ఏపీలోని కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనుండగా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఏపీలోని 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు కొనసాగుతోంది.

రెండు రోజుల్లో అల్పపీడనం..
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడనుంది. తెలంగాణలోనూ మరో నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 

తెలంగాణలో భారీ వర్షాలు  (Rains in Telangana) 
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 

మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. ప్రస్తుత సమాచారం మేరకు రాష్ట్రంలో ఆగస్టు 8 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల నేటి నుంచి మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్ష సూచనలతో ఈ ప్రాంతాలకు ఆగస్టు 7 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని ఉమ్మడి వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

19:56 PM (IST)  •  05 Aug 2022

క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు 

క్యాసినో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ స్పీడ్ పెంచింది. నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకరు మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ స్టేట్ మెంట్, వాట్సాప్ చాట్ ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి విచారణకు హాజరవ్వాలని ఈడీ కోరింది. 

16:00 PM (IST)  •  05 Aug 2022

పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థులను చితకబాదిన టీచర్

Nizamabad News : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణ రహితంగా చితకబాదాడు ఉపాధ్యాయుడు. మాస్టారు కొట్టిన దెబ్బలతో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఉపాధ్యాయుడి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

14:47 PM (IST)  •  05 Aug 2022

Dasoju Sravan: కాంగ్రెస్‌కు మరో షాక్, దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవలే పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇక టికెట్ తనకు దక్కదనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ ను వీడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:22 PM (IST)  •  05 Aug 2022

East Godavari: కరెన్సీనోట్ల అలంకరణలో అమ్మవారి ఆలయం, కడియపులంకలో 11.50 లక్షల నోట్లతో

శ్రావణ శుక్రవారం అనగానే లక్ష్మీదేవి పూజ ప్రత్యేకం.. వరలక్ష్మీ వ్రతాలను ఆచరించిన భక్తులు కోరిన కోర్కెల కోసం ప్రత్యేక పూజల్లో నిమగ్నమవుతారు.. వివాహిత స్త్రీలు కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం, సంతానం కోసం ప్రార్ధిస్థారు.. అదేవిధంగా పవిత్ర శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి చేసిన పూజలు అష్ట దేవితలను పూజించడం అవుతుందని ప్రగాఢ నమ్మకం.. ఈనేపథ్యంలోనే గ్రామాల్లోనూ గ్రామ దేవతలకు పూజలు చేసి వ్రతాలచరిస్తారు.. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో వేంచేసియున్న ముసలమ్మ అమ్మవారి ఆలయ గర్భగుడిలో అక్కడి భక్తులు కరెన్సీ నోట్లుతో అలంకరించి తమ ప్రత్యేకతను చాటుకుని భక్తి పారవశ్యంతో మురిసిపోయారు. లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ కొత్తనోట్లతో అలంకరించడంతోపాటు ఆలయం నిండా కరెన్సీ నోట్లుతో నింపి రంగ రంగుల పూలతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం దాదాపు రూ.11లక్షల 50 వేల ను వినియోగించారు. 2000 నోట్లు నుంచి వంద రూపాయల నోట్లు వరకు అందంగా అలంకరించి తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ విస్తృత ఏర్పాట్లు నిర్వహించగా అమ్మవారిని, నోట్లు రూపంలో ఉన్న ఈ లక్ష్మీదేవి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు వరుస కడుతున్నారు.

12:50 PM (IST)  •  05 Aug 2022

Fire Accident Near AP CM Camp Office: ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో అగ్నిప్రమాదం

తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పోలీసు ఔట్ పోస్ట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టెంట్ లోపలి సామాను దగ్దమైంది.
పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో తీవ్ర భయాందోళనలో‌ స్థానికులు
ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పింది. 
పోలీసు సిబ్బంది లోపల లేకపోవడంతో ముప్పు తప్పింది ..

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget