News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC

TSPSC Exam Postpone:

హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC.

ఏప్రిల్ నాలుగవ తేదీన జరగాల్సిన పరీక్షని జూన్ 17కి వాయిదా వేసిన TSPSC.

TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి

నాంపల్లి కోర్టు.... TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తి...

నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు కు తరలించిన సిట్ అధికారులు..

నలుగురు నిందితులను మూడు రోజుల పాటు విచారించినా సిట్..

ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, డాక్య లను నాంపల్లి కోర్టు లో హాజరు పరచిన సిట్.

 ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఏడాదిలోపు ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పాస్ కావాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. 

అమరావతిపై సుప్రీంలో విచారణ జులై 11కి వాయిదా

అమరావతే ఏకైక రాజధాని అంటూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతోపాటు చాలా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జులై 11 వ తేదీకి వాయిదా వేసింది.

కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

కడప జిల్లా పులివెందలలో కాల్పులు కలకలం రేపాయి. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మహబూబ్ లపై కాల్పులు జరిపాడు. దిలీప్, భరత్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో వివాదం నెలకొనడంతో కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉంది.

 అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం 

 

అనకాపల్లి జిల్లా ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పాకరావుపేట మండలం నామవరం గ్రామం వద్ద  నేషనల్ హైవే పై గడ్డి ట్రాక్టర్ కు విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. సుమారు 15వేల వరకు నష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  వెంటనే స్పందించిన అగ్నిమాప సిబ్బంది మంటలను అదుపులో తీసుకుంది.

Minister Indrakaran Reddy: బంజారా మహిళలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డ్యాన్స్

నిర్మల్ జిల్లా మామ‌డ మండల కేంద్రంలో నిర్వ‌హించిన‌ బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నానికి బంజారా మహిళలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి హజరయ్యారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ నృత్యాలు చేశారు. స్థానికుల కోరిక మేరకు బంజారా మహిళలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  నృత్యం చేశారు. దీంతో మహిళలు మురిసిపోయారు. సభికుల్లోనూ ఉత్సాహం నింపారు. 

YS Sharmila: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
  • వైఎస్ షర్మిల ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్
  • ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు బయలు దేరిన వైఎస్ షర్మిల
  • ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో వైఎస్ షర్మిల వాగ్వాదం
  • ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేవు - వైఎస్ షర్మిల
  • 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం 9 ఏళ్ల క్రితం చెప్పాడు - వైఎస్ షర్మిల
  • ప్రజలకు వైద్యం అందడం లేదని నాకు ఫిర్యాదులు వచ్చాయి - వైఎస్ షర్మిల
  • ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా - వైఎస్ షర్మిల
TDP Politburo Meeting: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం - హాజరైన ఏపీ, తెలంగాణ నేతలు

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ప్రారంభం అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ నేతలు హాజరయ్యారు. దాదాపు 20 అంశాల మీద చర్చ జరగనుంది. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పార్టీ బలోపేతం, రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు, పంట నష్టం - కష్టాల్లో రైతాంగం, సభ్యత్వ నమోదు, సాధికార సారథులు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన 11 కమిటీల వివరాలను నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

పోలీసులతో జరిగిన తోపులాటలో కింద పడ్డ షర్మిల

వైఎస్‌ ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రి సందర్శనకు షర్మిల బయల్దేరారు. ఆమెను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసులకు, ఆమెకు మధ్య జరిగిన తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. 

Kavitha in Delhi Liquor Case: ED ఆఫీస్ కు వెల్లిన కవిత లీగల్ అడ్వైజర్ సోమ భరత్

ఢిల్లీ లిక్కర్ కేసులో నేడు ఈడీ ఆఫీస్ కు ఎమ్మెల్సీ కవిత లీగల్ అడ్వైసర్ సోమా భరత్ వెళ్లారు. కవిత ఇచ్చిన ఆథరైజేషన్‌తో ప్రక్రియకు భరత్ వెళ్లినట్లుగా సమాచారం. గత విచారణ సందర్భంగా కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్ లలో డేటా బయటికి తీస్తున్నందున అందుకు సాక్షిగా ఆథరైజ్డ్ పర్సన్‌ను ఈడీ పంపించమని కోరింది. దీంతో కవిత ఇచ్చిన ఆథరైజేషన్‌తో ఆ ప్రక్రియకు భరత్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Hyderabad Dogs: హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కల బీభత్సం

హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఓ యువతి కాలును పట్టి పీకిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నగరంలోని మణికొండ ప్రాంతంలో లాంకో హిల్స్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.

TTD News: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం

తిరుమల శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద టిటిడి‌ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. సోమవారం రాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయంలోని భక్తులు ప్రవేశిస్తుండగా పాత స్కానింగ్ సెంటర్ వద్ద భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులు కొంచెం నెమ్మదించారు.. ఈ క్రమంలో అక్కడే ఉన్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుంటూరుకు చెందిన భక్తులను త్వరగా వెళ్ళాలంటూ ముందుకు తోశాడు.. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. ఈ క్రమంలో టిటిడి విజిలెన్స్ సిబ్బంది గుంటూరుకు చెందిన భక్తుడిని ఓ బూతు పదంతో అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో భక్తులు టిటిడి విజిలెన్స్ సిబ్బందితో గొడవకు దిగారు.. దీంతో క్యూ లైన్ నిలిచి పోయింది.. అయితే కొద్ది సేపటిలో త్రిదండి చిన్నజియ్యర్ స్వామీ వారు శ్రీనివాసుడి దర్శనానికి ఆలయ ప్రవేశం చేసే సమయంలో క్యూ లైన్ నిలిచి పోవడాన్ని గమనించిన శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో రమేష్ బాబు సంఘటన స్ధలానికి చేరుకుని ‌భక్తులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Background

AP, Telangana Weather Updates: నిన్నటి ద్రోణి నేడు మధ్య చత్తీస్‌గఢ్ నుంచి విధర్భ తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది. 

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల నేడు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు (మార్చి 29న) తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

Weather Warnings: వెదర్ వార్నింగ్స్ ఇవీ

నేడు (మార్చి 28) తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. వచ్చే 5 రోజుల పాటు కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వాతావరణం పొడిగానే ఉంటుందని అంచనా వేశారు. 

హైదరాబాద్ లో ఇలా

‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 054 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా

ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే గాలుల తీవ్రత అంతగా ఉండదని చెప్పారు. మళ్లీ మార్చి 31న ఈదురు గాలులు ఉంటాయని అంచనా వేశారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా..

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆనందాన్ని పొందుతున్నారు. ఆదివారం (మార్చి 26), రాజధాని ఢిల్లీలో మరోసారి ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. బుధవారం (మార్చి 29) నాటికి అది 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఇప్పుడు మొత్తం ఉత్తర భారత రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, తుపానులు తగ్గుతాయి. ఈ మారుతున్న వాతావరణం ప్రభావం ఉత్తరప్రదేశ్‌లోనూ కనిపించనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం సోమవారం (మార్చి 27) రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా నిర్మలంగా ఉంటుంది. ఈ వారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే ఆదివారం నుండి, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బలమైన ఎండలు కొనసాగాయి. ఉష్ణోగ్రత పెరుగుదల కూడా నమోదైంది.