అన్వేషించండి

AP NGOs: ఏపీ సర్కార్ హామీ - ఈ 27న రోడ్డు ఉద్యమం తాత్కాలిక వాయిదా

Bandi Srinivasa Rao News: ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. 

AP NGO News: విజయవాడ : గత రెండు వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో వైసీపీ సర్కార్ (YSRCP Government ) ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులను మంత్రుల బృందం (AP Ministers Team) ఆహ్వానించిన చర్చలలో తమకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. దాంతో ఈనెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన “బి ఆర్ టి ఎస్ మహా ఆందోళన” కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు (Bandi Srinivasa Rao) తెలిపారు. 

ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ పొందటం “పాక్షిక విజయం” 
ఆదివారం ఎన్జీవో హోమ్ (NGO Home) లో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు మధ్యంతర భృతి కోసం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సి ప్రయోజనాలు (12th PRC Benefits) కల్పించేలా పి ఆర్ సి కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మధ్యంతర భృతి ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో 70 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏ, డి ఏ ల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్ల రూపాయలు వీలైనంత సత్వరంగా నిధులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం చెప్పిందన్నారు. 

మార్చి నెలాఖరు నాటికి కొన్ని ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు 
పెన్షనర్ల డిమాండ్లలో ప్రధానమైన క్వాంటం ఆఫ్ పెన్షన్ లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఉన్న అవాంతరాలను అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకు ఇచ్చిన ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి  పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళన తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. 

ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర జేఏసీ 
27వ తేదీన తలపెట్టిన మహా ఆందోళన కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘ నేతలను పోలీసులు అక్రమ కేసులు పెడతామని బెదిరించడాన్ని, కొంతమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడాన్ని రాష్ట్ర జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పోలీసులు కూడా తమకు మిత్రులేనని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడానికి నిరసనగా 27వ తేదీన రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో సంఘ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి కె.వి శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందిన పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Also Read: టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget