అన్వేషించండి

Andhra News : సిబ్బందికి అందని జీతాలు - ఏపీ మంత్రి చాంబర్‌కు తాళం !

జీతాలు ఇవ్వడం లేదని ఏపీ మంత్రి వేణుగోపాల కృష్ణ చాంబర్‌కు ఉద్యోగులు తాళాలేశారు. వారికి ఏడు నెలలుగా జీతాలివ్వడం లేదు.


Andhra News :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు లేటు చేస్తోంది కానీ.. నెలల తరబడి ఇవ్వకుండా ఉంటోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేషీలో మాత్రం ఉద్యోగులకు గత జనవరి నుంచి జీతాలు అందడం లేదు. దాంతో వారు పేషీకి తాళం వేసుకుని ఊరెళ్లిపోయారు. సచివాలయంలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ   పేషీలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిలో అటెండర్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్లు నుంచి జీతాలు అందేలా ఏర్పాటు చేశారు. 

ఏడు నెలల నుంచి జీతాలు రావడం లేదన్న సిబ్బంది                          

అయితే పేషీలో సిబ్బందికి 2022 డిసెంబర్ నుంచి జీతాలు రావడంలేదు.  మంత్రికి, అధికారులకు జీతాలపై చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.  దీంతో గత ఏడు నెలలుగా జీతాలు రాక సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇలాగే ఉంటే జీతాలు ఎగ్గొడతారన్న  అనుమనంతో..  ఉద్యోగులు సహాయనిరాకరణకు దిగారు. తమ జీతాల విషయంలో అనేక మార్లు ఓఎస్డీ, మంత్రిని అడిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని.. వారు   చాంబర్ కూడా ఓపెన్ చేయకుండా తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. సోమవారం చాంబర్ తెరవలేదు. విషయమేమిటా అని అక్కడి ఉద్యోగులు ఆరా తీస్తే.. ఊరెళ్లామని.. దారి ఖర్చులకూ డబ్బుల్లేక రాలేకపోతున్నామని..జీతాలివ్వలేదని సమాధానం చెబుతున్నారు. 

బీజేపీ అగ్రనేతల విమర్శలపై జగన్ మౌనం - వారి ఆరోపణలను అగీకరిస్తున్నట్లేనా ?

వారంతా మంత్రి నియమించుకున్న వారే !                                                          

మంత్రి పేషీలో పని చేసే వారంతా.. మంత్రికి బాగా సన్నిహితులే అయి ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా ఇతరుల్ని మంత్రి కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకుంటారు. వీరు అలా నియమితులైన వాళ్లేనని తెలుస్తోంది. అయితే మంత్రి నియమించినప్పటికీ వారికి జీతాలు రాకపోవడంతో  ఇబ్బంది పడుతున్నారు. వారిని కాంట్రాక్ట్ ఉద్యోగుల కిందఇతర కార్పొరేషన్ల ఖాతాలో నియమించుకుని వారి సేవల్ని మంత్రి పేషిలో వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడు నెలలుగా జీతాలివ్వకపోవడాన్ని మంత్రి కూడా పరిష్కరించలేకపోవడంతో  సిబ్బంది తాళాలేసి ఊరికి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. 

టీడీపీ దుకాణం మూసేయడానికి సిద్ధంగా ఉంది- వాగ్దానాలు, మోసమే చంద్రబాబు సైకిల్‌: జగన్

జీతాలివ్వడం లేదని ఇటీవలే ముగ్గురు ఆత్మహత్యాయత్నం                                

ఏపీలో కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలకు ఇలాగే ఇబ్బంది పడుతున్నారని తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట స్కిల్ డెలవప్ మెంట్ శాఖలో జీతాలు ఇవ్వలేదని ముగ్గురు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేయడం కూడా సంచలనం సృష్టించిది. ఇలాంటివి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయని తెలిసినా సమయానికి జీతాలివ్వడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Embed widget