అన్వేషించండి

AP Temples: దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష, కీలక నిర్ణయాలివే

శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.300 కోట్లతో 3000 నూతన దేవాలయాల నిర్మాణ పనులు, దాదాపు రూ.500 కోట్లతో దేవాలయాల పునరుద్దరణ పనులు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

అమరావతి: దేవాదాయ ధర్మాదాయ శాఖ పనుల టెండర్లలో పారదర్శకతకు పెద్దపీఠ వేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో మంత్రి కొట్టు మాట్లాడారు.  అధికారులతో నేడు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు పనుల్లో పారదర్శకతకు పెద్దపీఠ వేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున కాంట్రాక్టు వర్కులు జరుగుతున్నాయని, అయితే  కాంట్రాక్టు పనుల్లో నాణ్యతకు పెద్ద పీఠవేసే విధంగా కాంట్రాక్టర్లలో పోటీ తత్వాన్ని పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో వారికి చెల్లించాల్సిన పేమెంట్ల విషయంలో జాప్యాన్ని నివారించేందుకై కమిషనరేట్ కార్యాలయంలో ఒక అక్కౌంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కాంట్రాక్టు పనులన్నింటికి ఈ అక్కౌంట్స్ విభాగం ద్వారానే చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ది కోసం పలు కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దాదాపు రూ.225 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, రూ.150 కోట్లతో శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయం తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాల అభివృద్ది పనులను ఇప్పటికే చేపట్టినట్లు చెప్పారు. సింహాచలం, ద్వారకా తిరుమల దేవాలయాల అభివృద్ది పనులను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. 

ఈ టెండర్ల ఖరారుతో పాటు అభివృద్ది పనులు పారధర్శకంగా జరిగేలా, రూ.5 కోట్లకు పైబడిన దేవాలయాల అభివృద్ది పనుల టెండర్ల పర్యవేక్షణకుగాను దేవాదాయ శాఖ కమిషనర్ అద్యక్షతన రాష్ట్ర స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పలు దేవాలయాల్లో ప్రసాదాలు తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థాల రేట్లలో వ్యత్యాసాన్ని గమనించామని చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని నియంత్రించేందుకు ప్రధాన పదార్థాల రేట్లను నిర్ణయించేందుకు ఒక రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఎన్.ఏ.బి.ఎల్. ఆమోదం పొందిన ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మంత్రి కొట్టు వివరించారు. 

దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.300 కోట్లతో 3000 నూతన దేవాలయాల నిర్మాణ పనులు, దాదాపు రూ.500 కోట్లతో దేవాలయాల పునరుద్దరణ పనులు చేస్తున్నారు. ఈ పనుల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ సిబ్బంది లేకపోవడంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అవసరం మేరకు సహాయక ఇంజనీర్లను, సూపర్వైజర్లను, టెక్నికల్ అసిస్టెంట్లను, డ్రాప్టుమ్యాన్ లను, స్తపతులను, డిప్యూటీ స్తపతులను ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ ద్వారా అవుట్ సోర్సింగ్ పై భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 
 
దేవాలయ భూముల గుర్తింపులో పురోగతి... 
ప్రతి జిల్లాలోనూ దేవాలయం వారీగా ఉన్న భూముల గుర్తింపు కార్యకంమం మంచి పురోగతిలో ఉంద్ననారు. ఇప్పటివరకూ  దాదాపు 4,07,486 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించగా, ఇందులో దాదాపు 2,80,712 ఎకరాల వివరాలను వెబ్ సైట్లో నమోదు చేశామన్నారు. అదే విధంగా దాదాపు 61 వేల ఎకరాల వాణిజ్య, అటవీ, నదీపరీవాహక  ప్రాంతాల భూమిని కూడా గుర్తించడం జరిగిందని, వీటి వివరాలను 43 రిజిష్టరులో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని పలు దేవాదాయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దేవాదాయ భూముల పరిరక్షణ చట్టాన్ని సవరించడంతో ఆయా భూములను కూడా తిరిగి స్వాదీనం చేసుకుంటామని మంత్రి కొట్టు చెప్పుకొచ్చారు.  

హిందూ  దర్మం అనేది ఒక మతం కాదని మానవుడి జీవన శైలిని, నడతను తెలియజేసే ఒక మహాన్నత విధానమన్నారు. ఈ మహోన్నత విదానాన్ని ప్రజలందరికీ  తెలియజేసేందుకే గత కొద్ది మాసాల నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రధాన దేవాలయాల్లో మాసోత్సవాలతోపాటు ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లోని 6(ఎ) దేవాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. వచ్చే వారంలో గోదావరి జిల్లాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget