అన్వేషించండి

AP Bar Policy : ఏపీలో మద్యం బార్ల వేలానికి భారీ స్పందన, తిరుపతిలో రూ1.59 కోట్లు పలికిన బార్

AP Bar Policy : ఏపీ ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన బార్ లైసెన్స్ విధానం ఖజానాకు సిరులు కురిపిస్తుంది. ఒక్కో బార్ కు కోట్ల రూపాయలు పెట్టేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.

AP Bar Policy : ఏపీలో మద్యం సిరులు కురిపిస్తుంది. మద్యం బార్ల వేలానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్ వేలం ధర రూ. 1.59 కోట్లు పలికింది. మద్యం బార్ వేలంలో కడప, తిరుపతి అధికార పార్టీ నేతలు పోటాపోటీగా పాల్గొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బార్లకు శనివారం ఈ ఆక్షన్‌ నిర్వహించారు. చాలా చోట్ల మద్యం బార్ల వేలం రూ. కోటి పైనే పలికాయి. అనంతపురంలో కూడా భారీగా పోటీ ఉంది. అనేక నగరాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తిరుపతి బార్ల వేలం దగ్గర వైసీపీ నేతల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. 

బార్ లైసెన్స్ లు ఆన్ లైన్ బిడ్డింగ్ 

ఏపీలో బార్ లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడంతో వ్యాపారులు పోటీపడ్డారు. మొదటిసారి ఆన్‌లైన్ విధానంలో బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా పోటీనెలకొంది. లైసెన్స్ ఫీజులు, మద్యం సరఫరా రూపంలో రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రుపాయలు రానున్నాయి. అదే సమయంలో తొలిసారి ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వ హిస్తుండగా లైసెన్సులు జారీలో పారదర్శకతకు అవకాశం కలిగిందని వ్యాపారులు అంటున్నారు.

బార్ లైసెన్స్ లకు భారీ స్పందన 

ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన బార్ లైసెన్స్ విధానానికి భారీ స్పందన వస్తుంది. ఈ వేలంలో బార్లు దక్కితే 2025 వరకూ లైసెన్స్ అమల్లో ఉంటుంది. మద్యం అమ్మకాలు పెరుగుతున్న క్రమంలో బార్లపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఫీజుల రూపంలోనే ఖజానాకు వందల కోట్ల ఆదాయం వస్తుంది. విశాఖలో మద్యం బార్ల పోటీ మరింత ఎక్కువగా ఉంది. బార్ లైసెన్స్ దక్కించుకునేందుకు భారీ స్పందన వచ్చింది. 2017-22 బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు రూ.44 లక్షలు ఉంది. బిడ్డింగ్ కూడా ఎక్సైజ్ అధికారుల ప్రమేయంతో జరిగేది. అయితే బార్ పాలసీలో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఎక్కడి నుంచైనా బిడ్డింగ్ వేయవచ్చు. లైసెన్స్ ఫీజులను పెంచడమే కాకుండా నాన్ రిఫండబుల్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. పెద్ద నగరాల్లో రూ.60 లక్షలు, జనాభా 5 లక్షలు దాటిన మున్సిపాలిటీల్లో రూ.35 లక్షలు, మిగిలిన టౌన్లలో రూ.15 లక్షలుగా ఫీజులు నిర్ణయించింది ప్రభుత్వం.

విశాఖలో టీడీపీ ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ విశాఖలో టీడీపీ మహిళల నిరసన చేపట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ పాదయాత్ర చేశారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంగలపూడి అనిత మాట్లాడుతూ.. జగన్ మద్యపాన నిషేధం అంటూ మద్యంధ్రప్రదేశ్ గా మర్చి మహిళల్ని మోసం చేశారన్నారు. జగన్ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి మహిళల పుస్తెలు తెంపుతున్నారన్నారు. మద్యం ఏరులై పారిస్తున్న జగన్ కి ఆ పాపం ఊరికే పోదన్నారు. మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వస్తానన్నారని, ఇప్పుడు సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారని ప్రశ్నించారు. మంత్రులు రోజా, విడదల రజనిలు దీనికి ఏం సమాధానం చెపుతారన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget