By: ABP Desam | Updated at : 21 Mar 2023 10:48 AM (IST)
Edited By: jyothi
మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు తమ 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ లను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాడుకోవచ్చని జగన్ సర్కార్ తెలిపింది. వీలున్నప్పుడు ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలనే నిబంధన ఉంది. దీన్ని సవరించి మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ.. ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంపీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా... ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా... దీనిపైనా సానుకూలంగా స్పందించారు. రెన్యువల్ ఆఫ్ రికగ్నజైషన్ ను ఎనిమిదేళ్లకు పెంచమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగానే ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్