అన్వేషించండి

Annadatha Sukibhava Scheme: ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు - ఇవి తప్పనిసరి!

Andhrapradesh News: ఏపీలో త్వరలోనే మరో పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. ఈ పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.

AP Government Annadatha Sukhibhava Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు పూర్తి కావొస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ పథకాల అమలు సహా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన వంటి హామీలు నెరవేర్చారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చారు. జులై 1 నుంచి పెరిగిన పింఛన్‌ రూ.1000తో పాటు ఏప్రిల్ నుంచి ఎరియర్లతో కలిపి ఒకేసారి రూ.7 వేలను లబ్ధిదారులకు అందించారు. ఇక మిగిలిన హామీల అమలుపైనా ప్రభుత్వం దృష్టి సారించారు. 

'అన్నదాత సుఖీభవ'

ఏపీ ప్రభుత్వం (AP Government) రైతుల కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన 'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకానికి పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించనుంది. గత ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కలిపే ఉండేది. కూటమి ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.20 వేలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పీఎం కిసాన్ నిధులు రూ.6000 చొప్పున మొత్తాన్ని అన్నదాతలకు అందించనుంది. ఏడాదికి 3 విడతల్లో పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ప్రకారం రెండు విడతల్లో రూ.5 వేలు, మూడో విడతలో రూ.4 వేలు ఇచ్చే అవకాశం ఉంది. 'అన్నదాత సుఖీభవ' పథకం కోసం త్వరలోనే ఓ పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇవి తప్పనిసరి

ఈ పథకం పొందేందుకు అర్హతలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ వర్గాల అంచనా ఏపీకి చెందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుందని సమాచారం. అలాగే, కుటుంబంలో ఎవరూ ట్యాక్స్ చెల్లించేంత ఆర్థిక స్థోమత కలిగి ఉండకూడదు. అలాగే, రైతులు ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పత్రాలు, ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ - మెయిల్ ఐడీ కలిగి ఉండాలని పేర్కొంటున్నారు.

అనంతరం, త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత ధ్రువపత్రాలను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: Free Gas Cylinder Scheme : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ స్కీమ్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget