![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vedic Students Tragedy : వేద పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు స్వరూపానంద సాయం.. మృతదేహాల తరలింపునకు ప్రభుత్వ సహకారం !
కృష్ణా నదిలో మునిగి చనిపోయిన వేదపాఠశాల విద్యార్థుల కుటుంబాలకు సాయం చేయాలని స్వరూపానందస్వామి నిర్ణయించారు. వారంతా యూపీ, ఎంపీలకు చెందిన వారు కావడంతో తరలింపు కోసం ప్రభుత్వం సాయం చేయనుంది.
![Vedic Students Tragedy : వేద పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు స్వరూపానంద సాయం.. మృతదేహాల తరలింపునకు ప్రభుత్వ సహకారం ! AP Governament shocked by death of Vedic school students - Swarupananda announces aid Vedic Students Tragedy : వేద పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు స్వరూపానంద సాయం.. మృతదేహాల తరలింపునకు ప్రభుత్వ సహకారం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/11/3e34fae1ae2eee62f2aeb10c167d919e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల నది స్థానం చేస్తూ మృత్యువాతపడటంపై వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శారదా పీఠం అధిపతి స్వరూపానంద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాలలో చనిపోయిన విద్యార్థుల మృతదేహాలను మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మండలం మాదిపాడు వేద పాఠశాల విద్యార్థులలో ఒకరిని కాపాడే ప్రయత్నంలో అతనితో పాటు ఐదుగురు చనిపోవటం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ప్రసిద్ది చెందిన వేద పాఠశాల అని.. శృంగేరి పీఠం వాళ్ళతోనూ మాట్లాడామని..ప్రభుత్వం వారికి కావాల్సిన సహకారం అందిస్తుందని హమీ ఇచ్చారు.
Also Read : సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేస్తారా? టీటీడీ పాలకమండలి భేటీపై అందరి దృష్టి
చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు చెందిన వారిని కావడంతో మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించాలని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. శృంగేరి పీఠం వాళ్ళతో మాట్లాడిన తర్వాత పరిహారం కూడా ఇస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వేదం నేర్చుకుంటున్నారని.. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
యూపీ, ఎంపీ నుంచి మృతుల కుటుంబీకులు వచ్చిన తర్వాత పోస్టు మార్టం నిర్వహించే అవకాశం ఉంది. వేద విద్యార్దుల మృతి పై స్వరూపానందేంద్ర స్వామి విచారం. వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందిని తెలిపారు.మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని మృతి చెందిన కుటుంబ సభ్యులకు రూ. 50వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో శ్వేత శృంగా చలం వేద పాఠశాల ఉంది. ఇతర ప్రాంతాలనుంచి కూడా విద్యార్థులు వచ్చి వేద విద్యను అభ్యసిసూ ఉంటారు. అందరూ రోజూ నదిలో స్నానం చేస్తూంటారని చెబుతున్నారు. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్ల కంటే వేగంగా కొత్త వైరస్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)